అమరావతిలో సీజీపీవోఏ ప్రాజెక్ట్కు కేంద్ర కేబినెట్ ఆమోదం.. సీఎం హర్షం
ABN , Publish Date - Jun 10 , 2026 | 06:09 PM
అమరావతిలో సీజీపీవోఏ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
అమరావతి, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో సీజీపీవోఏ (CGPOA) ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలను మరింత బలోపేతం చేస్తోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
ఆయా విభాగాల మధ్య సమన్వయం పెరిగి, ప్రజలకు సేవలు మరింత సమర్థవంతంగా అందుతాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధికి ఇది ఒక ముఖ్యమైన ప్రోత్సాహకంగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. రాజధాని నగరానికి అవసరమైన పరిపాలనా మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని వివరించారు.
ఒకే చోట అనేక కేంద్ర కార్యాలయాలు ఉండటంతో పని తీరులో వేగం, సౌలభ్యం పెరుగుతుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సుస్థిరమైన, ఆధునిక ప్రభుత్వ భవనాల ఏర్పాటుకు ఇది మరో కీలక మైలురాయి అని అభివర్ణించారు. ఏపీలో ప్రపంచ స్థాయి ప్రజా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం నుంచి అందుతున్న మద్దతుకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలపై సీఎం ఫోకస్.. డేటా డ్రివెన్ గవర్నెన్స్కు ప్రాధాన్యం
లోకేశ్పై జగన్ అండ్ కో ఫేక్ ప్రచారాలు చేస్తోంది.. రామ్మోహన్ ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News