దిగుబడి పెరిగి.. ధర తగ్గి..
ABN , Publish Date - Jun 26 , 2026 | 12:31 PM
అన్నమయ్య జిల్లా ములకలచెరువు మార్కెట్కు టమోటాలు పోటెత్తుతున్నాయి. దిగుబడుల ప్రభావం ధరపై పడుతోంది.
పతనం దిశగా టమోటా రేట్లు
23 కేజీల బాక్సు రూ.470
ములకలచెరువు(అన్నమయ్య): అన్నమయ్య జిల్లా ములకలచెరువు మార్కెట్కు టమోటాలు పోటెత్తుతున్నాయి. దిగుబడుల ప్రభావం ధరపై పడుతోంది. తంబళ్లపల్లె నియోజకవ్గంలోని ఆరు మండలాలతో పాటు సరిహద్దు గ్రామాలైన శ్రీసత్యసాయి జిల్లాలో టమోటా భారీగా సాగైంది. ప్రస్తుతం దిగుబడి వస్తున్నాయి. ఈ క్రమంలో మార్కెట్కు పెద్ద మొత్తంలో వస్తున్నాయి. గురువారం ఒకే ఒక లాట్ కాయలు రూ.470పలికాయి. మిగిలిన కాయలు నాణ్యతను బట్టి 23 కేజీల బాక్సు రూ.300 నుంచి రూ.400 మాత్రమే పలికాయి.
నిన్నటి వరకు రూ.530 పలికిన ధర మరింతగా తగ్గింది. వారం రోజుల క్రితం మార్కెట్కు కేవలం 10వేల నుంచి 20 వేల బాక్సుల కాయలు మాత్రమే వచ్చేవి. ఇప్పుడు 30 వేల నుంచి 45 వేల బాక్సులు కాయలు వస్తున్నాయి. ఇక్కడి నుంచి టమోటాలు ఉత్తరాది రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్ఘఢ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లకు ఎగుమతి అవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
సాయికృష్ణ డెడ్బాడీని మాయం చేసింది ఆ ముగ్గురే.. తేల్చిన సిట్
రఘురామకృష్ణంరాజు స్థలం కబ్జా యత్నం.. ఫోర్జరీ డాక్యుమెంట్లతో మోసం!
Read Latest AP News And Telangana News And International News And Telugu News