Share News

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 14 , 2026 | 08:19 AM

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం అంకురార్పణ చేయనున్నారు. ఇవాళ సాయంత్రం బ్రహ్మోత్సవ ఏర్పాట్లను శ్రీవారి సర్వ సేనాధిపతి విశ్వక్సేనులవారు పర్యవేక్షించనున్నారు.

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

తిరుమల, సెప్టెంబర్ 14 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈరోజు (సోమవారం) అంకురార్పణ చేయనున్నారు. ఇవాళ సాయంత్రం బ్రహ్మోత్సవ ఏర్పాట్లను శ్రీవారి సర్వ సేనాధిపతి విశ్వక్సేనులవారు పర్యవేక్షించనున్నారు. రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆలయంలో అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. రేపు (మంగళవారం) సాయంత్రం 6:21 నుంచి 6:35 నిమిషాల వరకు మీన లగ్నంలో శ్రీవారి ఆలయంలో ధ్వజారోహాణం కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించనున్నారు.


రాత్రి 7.30 గంటలకు ఏపీ ప్రభుత్వం తరుపున శ్రీవారికి పట్టువస్త్రాలను సీఎం చంద్రబాబు దంపతులు సమర్పించనున్నారు. రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంపై భక్తులకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనం ఇవ్వనున్నారు. ఎల్లుండి ఎస్వీ మ్యూజియం, ఎలక్ట్రికల్ బస్సులు, నందనం యాప్, భక్తులకు ఎల్‌ఐసీ పథకం, ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ సెంటర్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

‘నేతన్న సేవ’ కింద ఒక్కో నేతన్నకు రూ.25 వేల ఆర్థిక సాయం: మంత్రి జనార్దన్ రెడ్డి

గణేశ్ విగ్రహాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు: మంత్రి ఆనం

బాలిక గర్భం దాల్చిన ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 14 , 2026 | 08:43 AM