Harish Rao VS Revanth Govt: వైద్య సేవలు అందించడంలో రేవంత్ ప్రభుత్వం ఫెయిల్
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:26 AM
వైద్య సేవలు అందించడంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం విఫలం అయిందని మాజీ మంత్రి హరీష్రావు ఆరోపించారు. రైతుల ఆవేదనను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం… ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో కూడా ఫైయిల్ దని ధ్వజమెత్తారు.
హైదరాబాద్, ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో వ్యవసాయం పూర్తిగా కుప్పకూలిపోయిందనే విషాదాన్ని మరోసారి ఒక రైతు దుర్మరణం రుజువు చేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు (Harish Rao) తెలిపారు. అప్పుల భాదతో మహబూబ్నగర్ (Mahbubnagar) జిల్లా జడ్చర్ల మండలం ఈర్లపల్లిలో రవి నాయక్ (Ravi Nayak) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్(X) వేదికగా హరీష్రావు ట్వీట్ చేశారు.
వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ ఆస్పత్రులు చూపిన నిర్లక్ష్య వైఖరి రైతు మరణానికి కారణమైందని ఆరోపించారు. రైతుల ఆవేదనను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం… ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో కూడా విఫలమైందని ధ్వజమెత్తారు. ఇది కేవలం ఆస్పత్రుల నిర్లక్ష్యం కాదని, రేవంత్ ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. రైతులను నిరాశలోకి నెట్టి, ఇటు జీవితంలోనూ అటు మరణంలోనూ వారికి గౌరవం లేకుండా చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని మాజీమంత్రి హరీష్రావు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్లో ఘరానా మోసం.. ఏం జరిగిందంటే..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Read latest Telangana News And Telugu News