Bandi Sanjay: ఆ మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలి.. బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 27 , 2025 | 04:37 PM
రేవంత్రెడ్డి ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళా అధికారులను కాంగ్రెస్ మంత్రులు వేధిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్ .
కరీంనగర్ , అక్టోబరు27 (ఆంధ్రజ్యోతి): రేవంత్రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Government)పై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళా అధికారులను కాంగ్రెస్ మంత్రులు వేధిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటికి పిలిచి వార్నింగ్లు ఇస్తున్నారని విమర్శించారు. అర్ధరాత్రి మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకోవడం ఏమిటని ప్రశ్నల వర్షం కురిపించారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే మహిళల నమ్మకం కోల్పోయిందని ఎద్దేవా చేశారు బండి సంజయ్ కుమార్.
ఇవాళ(సోమవారం) కరీనంగర్లో బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో కేంద్రమంత్రి మాట్లాడారు. మహిళా అధికారులపై కాంగ్రెస్ మంత్రుల వేధింపులపై రేవంత్రెడ్డి ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో పోలీసులకే రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా అధికారులని వేధింపులకి గురిచేసిన ఆ మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆరోపించారు బండి సంజయ్ కుమార్.
పోలీసులపై రౌడీషీటర్లు హత్యాయత్నం చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదా..? అని ప్రశ్నించారు. పట్టపగలు గోరక్షకులపై కాల్పులు జరిపితే ఏం చేస్తున్నారు..? అని నిలదీశారు. తప్పు చేసిన రౌడీషీటర్లకు ఎంఐఎం అండగా ఉంటే వారికే వత్తాసు పలుకుతారా..? అని ఫైర్ అయ్యారు. ఒక వర్గం ఓట్ల కోసం ఎంఐఎం నేతల కాళ్లు పట్టుకునే దుస్థితిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని ఎద్దేవా చేశారు. మహిళలు కాంగ్రెస్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పుకొచ్చారు బండి సంజయ్ కుమార్.
నెలకు రూ.2,500లు, తులం బంగారం, స్కూటీపై కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. యూపీ తరహాలో రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. రౌడీషీటర్లు బయటకు రావాలంటేనే గజగజ వణికేలా చేయాలని హెచ్చరించారు. సర్దార్ వల్లభాయిపటేల్ 150వ ఐక్యతా మార్చ్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని యువతకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సర్దార్ వల్లభాయిపటేల్ చరిత్ర తెలుసుకోవాలని బండి సంజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్పై రాంచందర్ రావు సెటైరికల్ పోస్టర్

మరోవైపు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే ఆరు గ్యారెంటీలని అమలు చేస్తుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు సెటైరికల్ పోస్టర్ ఆవిష్కరించారు.
1.రౌడీ షీటర్లపై కేసులు ఎత్తివేత.
2. మామూళ్లు హఫ్తా వసూలు చేసేందుకు రౌడీ షీటర్లకు ప్రత్యేక లైసెన్సులు జారీ.
3. బెదిరింపులకు పాల్పడినా కేసులు నమోదు చేయం..
4. వయసు పైబడిన రౌడీ షీటర్లకు నెలకు రూ. 50వేల చేయూత..
5. రౌడీషీటర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు.
6. భూ కబ్జాలకు, సెటిల్మెంట్లకు ప్రత్యేక లైసెన్సు జారీ చేస్తారని రాంచందర్ రావు సెటైరికల్ పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మొంథా తుపాను ఎఫెక్ట్.. తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు
మెట్రోఫేస్-2ని అడ్డుకుంటుంది కిషన్రెడ్డినే.. మహేష్ గౌడ్ షాకింగ్ కామెంట్స్
Read Latest Telangana News And Telugu News