Minister Anam: పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - May 03 , 2025 | 03:20 PM
Minister Anam Ramanarayana Reddy: పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. శనివారం నాడు అధికారులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

నెల్లూరు: పెంచలకోన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మి అమ్మవార్లను ఇవాళ(శనివారం) రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దర్శించుకున్నారు. పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పెంచలకొన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆనం ఆదేశాలు జారీచేశారు.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున చలువ పందిళ్లు ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. 12 రోజుల పాటు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. రెండు నెలల క్రితం పులి సంచరిస్తోందని సోషల్ మీడియాలో వచ్చిన నేపథ్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆనం ఆదేశించారు. అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆర్ అండ్ బీ రోడ్ల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఆలయ అర్చకుల సూచనల మేరకు ఆగమ శాస్త్రం ప్రకారం బ్రహోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు.
ఈ వార్తలు కూాడా చదవండి
AP NEWS: సీరియల్ కిల్లర్ను చూసి వణికిపోయిన ప్రజలు
Vijayawada: అంతా పీఎస్సార్ కనుసన్నల్లోనే
Simhachalam: నోటి మాటతో గోడ కట్టేశారు
Simhachalam tragedy: గత ఐదేళ్లలో ఎన్నో ప్రమాదాలు.. అవన్నీ వైసీపీ ప్రభుత్వ హత్యలేనా
Andhra Pradesh weather: నేడు అక్కడక్కడా వర్షాలు ఎండలు
For More AP News and Telugu News