Share News

PM Modi: మోదీకి కుటుంబం లేకపోతే కుటుంబ పార్టీలన్నీ యుద్ధానికి దిగుతాయా?.. ప్రధాని ఫైర్

ABN , Publish Date - Mar 05 , 2024 | 01:52 PM

Telangana: తెలంగాణ ప్రజలు చూపిస్తున్న ప్రేమ, ఆదరణను వృథా కానివ్వను అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలో ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం పటేల్‌గూడలో ఏర్పాటు చేసిన సభలో.. ‘‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు’’ అంటూ మోదీ తెలుగులో స్పీచ్ మొదలుపెట్టారు.

 PM Modi: మోదీకి కుటుంబం లేకపోతే కుటుంబ పార్టీలన్నీ యుద్ధానికి దిగుతాయా?.. ప్రధాని ఫైర్

సంగారెడ్డి, మార్చి 5: తెలంగాణ ప్రజలు చూపిస్తున్న ప్రేమ, ఆదరణను వృథా కానివ్వను అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra modi) అన్నారు. మంగళవారం సంగారెడ్డిలో ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం పటేల్‌గూడలో ఏర్పాటు చేసిన సభలో.. ‘‘నా తెలంగాణ (Telangana) కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు’’ అంటూ మోదీ తెలుగులో స్పీచ్ మొదలుపెట్టారు. తెలంగాణను రెండింతలు అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఇది మోదీ గ్యారెంటీ.. మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తయ్యే గ్యారెంటీ అని స్పష్టం చేశారు. మనమంతా కలిసి దేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలన్నారు. ప్రపంచంలో తెలుగు వారి ఖ్యాతి వ్యాప్తిచెందిందని.. ఇది దేశానికి గర్వకారణమని చెప్పుకొచ్చారు. ‘‘కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు చేస్తామని చెప్పామని. చేశామా? లేదా? అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట చేస్తామని చెప్పాం.. చేశామా? లేదా?.. మోదీ ఇచ్చిన గ్యారెంటీ.. నెరవేరిందా? లేదా?’’ అని అన్నారు.

Satya Kumar: గుక్కెడు మంచినీరు అడగడమే నేరమా? దానికే కేసులు హత్యలా?


మీకోసం మరో గ్యారెంటీ...

ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న దేశంగా భారత్ ఎదుగుతోందని అన్నారు. ‘‘ఇప్పుడు మీకు మరో గ్యారెంటీ ఇస్తున్నా. కొన్నేండ్లలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్‌ను తీర్చిదిద్దుతా.. మీకు మాటిస్తున్నా. ఇది మోదీ గ్యారెంటీ.. మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తయ్యే గ్యారెంటీ. మోదీని తిట్టడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. అలా ఎందుకు చేస్తున్నారంటే.. వారికి సంబంధించిన వేల కోట్ల అవినీతిని ప్రశ్నించినందుకు తిడుతున్నారు. నేను వ్యక్తిగతంగా ఎవరిపైనా విమర్శలు చేయలేదు.. కుటుంబ పాలనపై ప్రశ్నించినందుకు నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. జమ్ము కశ్మీర్ నుంచి మొదలు తమిళనాడు వరకు కుటుంబ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి.. రాష్ట్రం మాత్రం అధోగతి పాలైంది. కుటుంబ పాలనను మేము వ్యతిరేకిస్తున్నాం. అందుకే మాపై వారు విమర్శలు చేస్తున్నారు. నేను కుటుంబ పాలనపై ప్రశ్నిస్తుంటే.. వారు మాత్రం నాకు కుటుంబం లేదని నాపై విమర్శలు చేస్తున్నారు. కుటుంబ పాలన చేసే వారికి దొంగతనం చేసేందుకు లైసెన్స్ ఇచ్చారా? కబ్జా, అవినీతి చేసేందుకు లైసెన్స్ ఇచ్చారా? ఒక్కో కుటుంబంలో 50 మంది వరకు దోచుకుతింటున్నారు.. ఇది ప్రజాస్వామ్యమా? మోదీపై మా యుద్ధం కొనసాగిస్తామని చెబుతున్నారు. మోదీకి కుటుంబం లేకపోతే కుటుంబ పార్టీలన్నీ యుద్ధానికి దిగుతాయా? కుటుంబ పార్టీలన్నీ తమ కుటుంబమే ఫస్ట్ అనుకుంటాయి.. కానీ మోదీకి మాత్రం నేషన్ ఫస్ట్. వారికి వారి కుటుంబమే ముఖ్యం.. కానీ నాకు దేశ ప్రజలంతా ముఖ్యం. కుటుంబ పార్టీలు నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చుకున్నాయి. కానీ నేను అలా కాకుండా నాకు వచ్చిన గిఫ్టులను దేశ అభివృద్ధి కోసం వేలం వేస్తున్నా.. గంగా మాత సేవ కోసం ఉపయోగిస్తున్నా. నేను మీ సేవకుడిని. నాకు కూడా కుటుంబం ఉంటే.. నాకు వచ్చిన గిఫ్టులను, వేలం ద్వారా వచ్చిన డబ్బులను నేను పట్టుకెళ్లేవాడినేమో.. కుటుంబ పార్టీలకు చెందిన కొందరు నేతలు విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్ చేశారు. వారు తమ కుటుంబం కోసం కోటలు కట్టించుకున్నారు. కానీ మోదీ ఇప్పటి వరకు తన కోసం ఒక్క ఇల్లును కూడా కట్టించుకోలేదు. కానీ ఇండ్లు లేని పేదల కోసం 4 లక్షల కోట్ల ఇండ్లను నిర్మించాడు. కుటుంబ పార్టీలు భూమి నుంచి ఆకాశం వరకు దేన్నీ వదలకుండా దోచుకున్నారు. కానీ మోదీ మాత్రం భుమి, ఆకాశం మాత్రమే కాకుండా పాతాళం వరకు ప్రతీ ఒక్క అవకాశాన్ని దేశాభివృద్ధి కోసమే చేస్తున్నారు. 140 కోట్ల మంది దేశ ప్రజలు మోదీ కుటుంబ సభ్యులే.. కాంగ్రెస్, ఇండియా కూటమి వాళ్లకు ఇంకా తెలియడం లేదు.. మోడీని దేశమంతా తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు. తెలంగాణ ప్రజలంతా నేనే మోదీ కుటుంబమని చెబుతున్నారు’’ అని ప్రధాని వెల్లడించారు.

YCP: వైసీపీకి మంత్రి రాజీనామా.. జగన్ విగ్రహంగా మారారంటూ సంచలనం..


కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవినీతి బంధం..

తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో నిధులు కేటాయించిందని తెలిపారు. నిరుద్యోగ యువకుల కల నెరవేర్చడంలో తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. వారి కలలను నిజం చేయడమే తన సంకల్పమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ (Congress) అధికారంలో ఉన్న దానితో పోల్చుకుంటే.. ఈ పదేండ్లలో దళిత, వెనుకబడిన వర్గాల ప్రజల కోసం పదేళ్లలో ఎంతో చేశామన్నారు. మాదిగ రిజర్వేషన్ల కోసం ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేశామన్నారు. వారి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ (BTRS) అవినీతి కారణంగా కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారని.. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే. నాణేనికి ఒక వైపు కాంగ్రెస్ అయితే మరోవైపు బీఆర్ఎస్. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవినీతి బంధం ఉంది. బీఆర్ఎస్ చేసిన కాళేశ్వరం అవినీతిని బయటపెట్టకుండా, విచారణకు ఆదేశించకుండా కాంగ్రెస్ కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అవినీతి బంధాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ అవినీతిని కప్పిపుచ్చుతోందన్నారు. కాళేశ్వరం బీఆర్ఎస్‌కు ఏటీఎంలా మారిందన్నారు. అయితే.. కాంగ్రెస్ ఎన్ని రోజులు బీఆర్ఎస్ అవినీతిని కప్పిపుచ్చుతోందో చూస్తాం.. అది ఎక్కువ రోజులు నిలవదన్నారు. తనకు సర్జికల్ స్ట్రైక్ చేయడం చూశాం.. ఎయిర్ స్ట్రైక్ చేయడం కూడా తెలుసన్నారు. ఇంత ఎండలో తన కోసం వచ్చారని.. ఇది మామూలు విషయం కాదన్నారు. ‘‘అబ్ కీ బార్.. 400 దాటాలి.. బీజేపీకి ఓటు వేయాలి’’ అంటూ తెలుగులో ప్రధాని మోదీ తెలుగు వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి...

CM Jagan: మరీ ఇంత కక్షా?.. మరోసారి రాజధాని అమరావతిపై విషం కక్కిన జగన్


New buses: వచ్చే విద్యాసంవత్సరంలో కొత్తబస్సులు.. జూన్‌నాటికి సంఖ్య పెంపు..


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 05 , 2024 | 01:52 PM