Home » Sangareddy
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పటాన్చెరులోని శ్రీరామ్ ఆటో మాల్కు చెందిన వాహనాల గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో మూడు టిప్పర్లు, డీసీఎం, రెండు ఆటోలు దగ్ధమయ్యాయి.
కందిలోని సంగారెడ్డి సెంట్రల్ జైల్ నుంచి బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ విడుదలయ్యారు. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నందుకే తనపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు.
సంగారెడ్డి జిల్లా ఆర్సీపురంలోని రామచంద్రారెడ్డి నగర్ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు గిరిధర్ మృతిచెందాడు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిధిలోని బైపాస్ రోడ్డుపై విషాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాలీ ఆటోను వెనుక నుంచి ఒక కారు అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ వద్ద టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల మధ్య ఘర్షణలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కండక్టర్ తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు రూ.20 వేలు లంచం అడిగినట్లు ఇన్స్పెక్టర్పై తప్పుడు ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది.
ఆర్టీసీ టికెట్ ఇన్స్పెక్టర్ను కండక్టర్, ప్రయాణికులు చెప్పులతో కొట్టడం సంచలనం రేపింది. టికెట్ లేకుండా బస్సులో ప్రయాణించిన వ్యక్తితో పాటు కండక్టర్ను ఆర్టీసీ అధికారి లంచం అడగటంతో ఈ ఘటన జరిగింది.
హైదరాబాద్ నగరానికి మంజీరా జలాలు మళ్లీ నిలిచిపోయాయి. కృష్ణా, గోదావరి జలాల మాదిరిగా నిరాటంకంగా నగరానికి నీళ్లు సరఫరా కావడం లేదు.
ప్రశ్నించే వారిపై కాంగ్రెస్ అక్రమ కేసులు పెడుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. రైతులు, రాష్ట్ర ప్రజల పట్ల కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదన్నారు. ఎవరు మాట్లాడితే వాళ్లపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంగారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. సంగారెడ్డి ఘటనలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా, జోగులాంబ గద్వాల జిల్లా ఘటనలో పెనుప్రమాదం తప్పి ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఒకప్పుడు పల్లెల్లో చల్లటి మట్టి కుండలో దాచిన అంబలి, అవ్వ ప్రేమతో కలిపిన సద్దన్నం కేవలం ఆకలిని తీర్చడమే కాకుండా.. ప్రాణాలకు రక్షణనిచ్చే సంజీవనిలా ఉండేవి.