Share News

Satya Kumar: గుక్కెడు మంచినీరు అడగడమే నేరమా? దానికే కేసులు హత్యలా?

ABN , Publish Date - Mar 05 , 2024 | 01:30 PM

ఏపీలో రైతులు, సామాన్యుల దుస్థితిపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు లేక అన్నదాతల ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. సామాన్య ప్రజలేమో తాగు నీరు దొరక్క వలస వెళ్లిపోతున్నారని ఎక్స్ వేదికగా సత్యకుమార్ పేర్కొన్నారు.

Satya Kumar: గుక్కెడు మంచినీరు అడగడమే నేరమా? దానికే  కేసులు హత్యలా?

అమరావతి: ఏపీ (AP)లో రైతులు, సామాన్యుల దుస్థితిపై బీజేపీ (BJP) జాతీయ కార్యదర్శి సత్యకుమార్ (Satya Kumar) ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు లేక అన్నదాతల ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. సామాన్య ప్రజలేమో తాగు నీరు దొరక్క వలస వెళ్లిపోతున్నారని ఎక్స్ వేదికగా సత్యకుమార్ పేర్కొన్నారు. గుక్కెడు మంచి నీళు అడగడమే జగన్ పాలనలో నేరమైందని.. దానికే కేసులు, హత్యలు చేస్తున్నారన్నారు. వీళ్లను ఇలాగే వదిలేస్తే చివరకు జగన్ బ్రాండ్ మద్యం మాత్రమే తాగి దాహం తీర్చుకోవాలని అడ్డంగా వాదించి జీవో కూడా తేస్తారేమోనని సత్యకుమార్ అన్నారు.

TDP: సోమిరెడ్టి కాలితో తన్నగా కూలిపోయిన నిర్మాణాలు

‘‘సాగునీరు లేక అన్నదాతల ఆత్మహత్యలు! తాగునీరు దొరక్క ప్రజల వలసలు!!’ సీఎం జగన్‌ (CM Jagan) కు, సీమలో కరువు తీవ్రత కనిపించడం లేదా? దాహంతో గొంతెండుతున్న పల్లెల గోడు పట్టడం లేదా? తాగడానికి నీళ్లు కూడా లేక పల్లెలకు పల్లెలు వలసలు పోతున్న దుస్థితి తెలియడం లేదా? నీళ్ల కోసం మంత్రుల్ని, ఎమ్మెల్యేలని నిలదీస్తున్న సంఘటనలు, ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్న ప్రజల ఆక్రందనలు వినిపించడం లేదా? గుక్కెడు మంచినీరు అడగడమే నేరమా? దానికే కేసులు హత్యలా? జగన్ బ్రాండ్ మద్యం మాత్రమే తాగి దాహం తీర్చుకోవాలని అడ్డంగా వాదించి జీవో తెస్తారేమో?’’ అని సత్యకుమార్ పేర్కొన్నారు.

CM Jagan: మరీ ఇంత కక్షా?.. మరోసారి రాజధాని అమరావతిపై విషం కక్కిన జగన్

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 05 , 2024 | 01:30 PM