Share News

Kishan Reddy: జగన్‌కు పట్టిన గతే కేసీఆర్‌కు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - May 20 , 2024 | 08:20 PM

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఇచ్చిన ఉచితాలకు.. ఆయన ఇంట్లో కూర్చుని గెలివాలని కాని ఆ పరిస్థితి లేదని చెప్పారు.

 Kishan Reddy: జగన్‌కు పట్టిన గతే కేసీఆర్‌కు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
Kishan Reddy

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఇచ్చిన ఉచితాలకు.. ఆయన ఇంట్లో కూర్చుని గెలివాలని కాని ఆ పరిస్థితి లేదని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఓడించినట్లే.. జగ‌న్ అహంకారమే ఆయనను ఓడిస్తోందని విమర్శించారు.జగన్.. అభివృద్ధిపై దృష్టి పెడితే మరోలా ఉండేదన్నారు. ఏపీ, తెలంగాణలో రోడ్లు దారుణంగా ఉన్నాయని అన్నారు.


సోమవారం మీడియాతో కిషన్‌రెడ్డి చిట్‌చాట్ నిర్వహించారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీని బీజేపీ ఖచ్చితంగా గెలుస్తోందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిపై గతంలో ఫైటర్ అనే అభిప్రాయం ఉండేదని.. ప్రస్తుతం అతనిపై బ్లాక్ మెయిలర్ అనే ముద్ర పడిందని విమర్శించారు. కాంగ్రెస్ క్యాడర్, లీడర్ ఆయనకు సహకరించటం లేదని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని... బీఆర్ఎస్ ప్రభావం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నిక రావటం బీజేపీకి కలసి వచ్చిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ కేబినెట్ భేటీ నేడు..

సిట్ దర్యాప్తులో అసలు వాస్తవాలు..!

జగన్ ఓటమి తధ్యం.. మరోమారు స్పష్టం చేసిన పీకే

చంద్రబాబుతో టచ్‌లోకి ఏపీ అధికారులు

పోలీసులను ఆట ఆడించేది జగనేనా?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 20 , 2024 | 08:22 PM