Share News

Viral: పెళ్లివేదికపై ఉన్నట్టుండి షాకింగ్ ట్విస్ట్.. చివరకు వధువును ఆస్పత్రికి తీసుకెళ్లగా..

ABN , Publish Date - Mar 06 , 2024 | 03:57 PM

వివాహ కార్యక్రమాల్లో విచిత్ర ఘటనలు చోటు చేసుకోవడం తరచూ చూస్తూ ఉంటాం. తీరా తాళి కట్టే సమయంలో కొన్నిసార్లు సినిమా తరహా ట్విస్ట్‌లు చోటు చేసుకుంటుంటాయి. వధూవరుల్లో ఎవరో ఒకరు వివాహం ఇష్టం లేదంటూ తిరస్కరించడమో, లేక కుటుంబ సభ్యులు వ్యతిరేకించడమో జరుగుతుంటుంది. అయినా...

Viral: పెళ్లివేదికపై ఉన్నట్టుండి షాకింగ్ ట్విస్ట్.. చివరకు వధువును ఆస్పత్రికి తీసుకెళ్లగా..
ప్రతీకాత్మక చిత్రం

వివాహ కార్యక్రమాల్లో విచిత్ర ఘటనలు చోటు చేసుకోవడం తరచూ చూస్తూ ఉంటాం. తీరా తాళి కట్టే సమయంలో కొన్నిసార్లు సినిమా తరహా ట్విస్ట్‌లు చోటు చేసుకుంటుంటాయి. వధూవరుల్లో ఎవరో ఒకరు వివాహం ఇష్టం లేదంటూ తిరస్కరించడమో, లేక కుటుంబ సభ్యులు వ్యతిరేకించడమో జరుగుతుంటుంది. అయినా కొన్ని వివాహాలు చివరకు సుఖాంతం అవుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వివాహంలో చోటు చేసుకున్న విచిత్ర ఘటనకు సంబంధించిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పెళ్లి వేకికపై వధువుకు ఉన్నట్టుండి కడుపునొప్పి మొదలైంది. బంధువులంతా షాక్‌లో ఉండగా.. చివరకు ఆస్పత్రిలో ఏం జరిగిందంటే...

పశ్చిమ బెంగాల్ (West Bengal దుర్గాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన సుచరిత అనే యువతి.. ఢిల్లీలోని (Delhi) ఓ సంస్థలో మైక్రోబయాలజిస్ట్‌గా పని చేస్తోంది. అలాగే ఇదే ప్రాంతానికి చెందిన అమిత్ ముఖర్జీ అనే యువకుడు.. నోయిడాలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఇదిలావుండగా, వీళ్లిద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టం ఉండడంతో.. వివాహం (marriage) చేయాలని కుటుంబ సభ్యులు అనుకున్నారు. రెండేళ్ల క్రితమే వీరి వివాహానికి ముహూర్థం ఖరారు చేశారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇటీవల ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. వివాహానికి రెండు రోజుల ముందు యువతికి ఉన్నట్టుండి కడుపునొప్పి (stomach ache) మొదలైంది.

Viral Video: గుడ్లను తినేందుకు వెళ్లిన పామును.. ఈ పక్షులన్నీ కలిసి ఎలా పరేషాన్ చేశాయో చూడండి..

చూస్తుండగానే నొప్పి ఎక్కువ అవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బంధువులు, సన్నిహితులు, స్నేహితులు.. గ్రామానికి చేరుకోవడంతో పెళ్లిని వాయిదా వేసేందుకు వీలు కాలేదు. చివరకు వధూవరుల కుటుంబ సభ్యులు కలిసి మాట్లాడుకున్నారు. ఎలాగైనా అదే ముహూర్థానికి పెళ్లి జరగాలని వధూవరులు కూడా పట్టుబట్టడంతో అంతా కలిసి ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులకు విషయం తెలియజేయడంతో చివరకు ఆస్పత్రి వార్డులోనే వివాహం చేసేలా అంగీకరించారు. దీంతో ఎట్టకేలకు అతిథుల సమక్షంలో అదే ముమూర్థానికి ఇద్దరికీ వివాహం చేశారు. కాగా, ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: చింపాంజీ అని తక్కువ అంచనా వేశారంటే.. ఇలాగే షాక్‌లు ఇస్తుంది మరి..

Updated Date - Mar 06 , 2024 | 04:01 PM