Share News

Death Mystery: అయ్యా.. ఎవరో కారులో వచ్చి ఇద్దరి మృతదేహాలకు నిప్పంటించారంటూ పోలీసులకు ఫోన్.. వెళ్లి చూస్తే..!

ABN , First Publish Date - 2023-11-28T17:54:25+05:30 IST

మహిళలపై దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మాయమాటలు చెప్పి మోసం చేయడం, తమ దారికి రాని వారిపై దాడులకు తెగబడడం చేస్తున్నారు. కొందరైతే మరీ రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. మరికొందరైతే పోలీసులకు దొరక్కుండా...

Death Mystery: అయ్యా.. ఎవరో కారులో వచ్చి ఇద్దరి మృతదేహాలకు నిప్పంటించారంటూ పోలీసులకు ఫోన్.. వెళ్లి చూస్తే..!
ప్రతీకాత్మక చిత్రం

మహిళలపై దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మాయమాటలు చెప్పి మోసం చేయడం, తమ దారికి రాని వారిపై దాడులకు తెగబడడం చేస్తున్నారు. కొందరైతే మరీ రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. మరికొందరైతే పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సిని ఫక్కీలో దారుణాలక పాల్పడుతున్నారు. తాజాగా, ఛత్తీస్‌గఢ్‌‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొందరు స్థానికులు పోలీసులకు ఫోన్ చేసి.. ‘‘అయ్యా.. ఎవరో కారులో వచ్చి ఇద్దరి మృతదేహాలకు నిప్పంటించారు’’.. అని చెప్పారు. చివరకు పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా.. షాకింగ్ సీన్ కనిపించింది. వివరాల్లోకి వెళితే..

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) రాయ్‌గఢ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక జుట్‌మిల్ పోలీస్ స్టేషన్ పరిధి నేతనగర్ గ్రామం ప్రధాన రహదారికి సమీపంలో ఓ మహిళ, ఓ చిన్నారి మృతదేహాలను (woman and child Dead bodies) రాత్రి 2గంటల సమయంలో కారులో తీసుకొచ్చి నిప్పంటించారు. అదే సమయంలో అక్కడే ఉన్న కొందరు స్థానికులు ఈ ఘటనను చూసి షాక్ అయ్యారు. వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే చివరకు అందులో మహిళ, చిన్నారి మృతదేహాలను చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Homemade Geyser: వేలకు వేలు పెట్టి గీజర్లు కొనలేక.. ఇంట్లోనే ఎలా తయారు చేశారో మీరే చూడండి..!

అయితే అప్పటికే ఇద్దరి మృతదేహాలు చాలా వరకు కాలిపోవడంతో గుర్తుపట్టడం కష్టంగా మారింది. ఫోరెన్సిక్ బృందం కూడా అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మహిళపై ఎవరో అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. వేరే రాష్ట్రానికి చెందిన వారు మహిళ మృతదేహాన్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి దహనం చేసినట్లు తెలుస్తోంది. కేసును త్వరగా ఛేదించేందుకు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Cheapest Market: దేశంలోనే ఛీపెస్ట్ మార్కెట్ ఇదే.. 5 జతల లెదర్ షూలు కేవలం 500 రూపాయలేనట..!

Updated Date - 2023-11-28T17:54:37+05:30 IST