Share News

Crime News: గోతిలో ఏదో పాతిపెతినట్లు అందరికీ అనుమానం.. చివరకు పోలీసుల సమక్షంలో తవ్వి చూడగా షాకింగ్ సీన్..

ABN , First Publish Date - 2023-11-26T18:41:40+05:30 IST

ఒకే ఒక్క ఘటనతో ఆ ఊరు ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పని మీద ఇంటి నుంచి బయటికి వెళ్లిన మహిళ రాత్రవుతున్నా తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు కంగారుపడి రాత్రంతా వెతికారు. అయినా ఆమె జాడమాత్రం కనిపించలేదు. మరసటి రోజు...

Crime News: గోతిలో ఏదో పాతిపెతినట్లు అందరికీ అనుమానం.. చివరకు పోలీసుల సమక్షంలో తవ్వి చూడగా షాకింగ్ సీన్..

ఒకే ఒక్క ఘటనతో ఆ ఊరు ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పని మీద ఇంటి నుంచి బయటికి వెళ్లిన మహిళ రాత్రవుతున్నా తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు కంగారుపడి రాత్రంతా వెతికారు. అయినా ఆమె జాడమాత్రం కనిపించలేదు. మరసటి రోజు గ్రామస్తులకు నిర్మానుష్య ప్రదేశంలో అనుమానాస్పద దృశ్యం కనిపించింది. గోతిలో ఎవరినో పాతిపెట్టినట్లు అనుమానరం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గోతిని తవ్వించగా.. చివరకు షాకింగ్ దృశ్యం కనిపించింది. వివరాల్లోకి వెళితే..

ఒడిశా (Odisha) నబరంగ్‌పూర్ జిల్లా రాయ్‌ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక బఘబెడ గ్రామానికి చెందిన తిలబతి అనే బుధవారం ఎక్కడికో వెళ్తున్నాని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే రాత్రికీ తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు కంగారుపడి చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా (woman Missing) ఆమె జాడ మాత్రం దొరకలేదు. మరుసటి రోజు గ్రామస్తులు కూడా ఆమె కోసం వెతికారు. ఈ క్రమంలో మురమడిహి గ్రామ సమీపంలో ఎవరినో పాతిపెట్టినట్లు గుర్తించారు.

wife: దుబాయ్‌లో పుట్టిన రోజు వేడుకలు ప్లాన్ చేసిన భార్య... భర్త అభ్యంతరం చెప్పడంతో చివరకు ఆమె చేసిన నిర్వాకం..

అయితే శనివారం పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన వ్యక్తి.. తన కుమార్తెను (father killed his daughter) తానే చంపేసి పాతి పెట్టానని చెప్పాడు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గుంత తవ్వించారు. చివరకు మహిళ మృతదేహానికి సంబంధించిన 31 ముక్కలను వెలికితీశారు. వాటిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే మృతురాలి సోదరుడు మాట్లాడుతూ తమ సోదరిని ఎవరు చంపారో తెలీదని, తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నాడు. ఆ కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఖచ్చితమైన కారణాలను నిర్ధారించలేదు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాశంగా మారింది.

Crime news: పూజలు చేయాలంటూ పామును తీసుకొచ్చి రాత్రివేళ ఇంట్లో వదిలిన భర్త.. నెల రోజుల తర్వాత బయటపడ్డ షాకింగ్ ట్విస్ట్..

Updated Date - 2023-11-26T18:59:08+05:30 IST