Home » Odisha
ఒడిశా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం దాదాపు రూ. 47,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం రోజే ఈ కార్యక్రమాలు జరగడం విశేషం.
ఒడిశా రాష్ట్రంలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. వర్షాలు పడటం కోసం ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకున్నారు.
ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని రద్దీగా ఉండే 'ఝార్పడ వంతెన' సమీపంలో ఒకే ట్రాక్పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. లోకో పైలట్లు సకాలంలో స్పందించడంతో ఒక పెద్ద రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది.
రూ.6 వేల నెల జీతంతో సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన ఓ ఇంజినీర్.. అవినీతి సొమ్ముతో వందల రెట్లు అక్రమాస్తులు కూడబెట్టాడు. బ్యాంకు లాకర్లలో దాచిపెట్టిన రూ.2 కోట్ల అక్రమ నగదుతోపాటు భారీగా స్థిరాస్తులను విజిలెన్స్ అధికారులు సోదాల్లో గుర్తించారు.
పక్షవాతంతో మంచానికి పరిమితం అయిన ఓ వృద్ధుడిని విష సర్పం చుట్టేసింది. నాలుగు గంటల పాటు నరకం చూపించింది. ఈ సంఘటన ఒడిశాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.
ఒడిశాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కళహండి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్లోకి దిగిన ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. ఊపిరాడకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతాదళ్కు మరో గట్టిదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ దేబాశిష్ సమంతరాయ్ సోమవారంనాడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను నవీన్ పట్నాయక్కు పంపారు.
స్వల్పశ్రేణి లక్ష్యాలను ఛేదించే అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణ పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరంలోని చాందీపూర్లోనున్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి వ్యూహాత్మక దళాల కమాండ్ (ఎస్ఎఫ్సీ) ఆధ్యర్వంలో శుక్రవారంనాడు ఈ క్షిపణ పరీక్ష జరిగింది.
తేనె కోసం కొండ రాళ్ల మధ్యలోకి దూరిన ఓ బాలుడి తల లోపల ఇరుక్కుపోయింది. బయటకు రాలేని పరిస్థితిలో బాలుడు 8 గంటల పాటు నరకం చూశాడు. ఈ సంఘటన ఒడిశాలో బుధవారం చోటుచేసుకుంది.
ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో ఒక అసాధారణ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి, తన సోదరి ఖాతాలోని రూ. 19,300ను రాబట్టుకునేందుకు, ఆమె అస్థిపంజరాన్ని భుజంపై మోసుకుంటూ మండుటెండలో మూడు కిలోమీటర్లు బ్యాంకుకు నడిచాడు.