Share News

Death Mystery: ఒకేసారి నలుగురు పిల్లల మృతి.. కరెంట్ షాక్‌తో చనిపోయారనుకున్న తల్లి.. పోస్ట్‌మార్టం రిపోర్టులో షాకింగ్ ట్విస్ట్..

ABN , First Publish Date - 2023-11-25T15:57:16+05:30 IST

నలుగురు పిల్లలతో సంతోషంగా జీవిస్తున్న ఆ దంపతుల మధ్య ఉన్నట్టుండి అనుకోని సమస్యలు వచ్చిపడ్డాయి. దీంతో అప్పటిదాకా సాఫీగా సాగిన సంసారం కాస్త.. సమస్యలకు నిలయంగా మారింది. ఈ క్రమంలో ఓ రోజు..

Death Mystery: ఒకేసారి నలుగురు పిల్లల మృతి.. కరెంట్ షాక్‌తో చనిపోయారనుకున్న తల్లి.. పోస్ట్‌మార్టం రిపోర్టులో షాకింగ్ ట్విస్ట్..
ప్రతీకాత్మక చిత్రం

నలుగురు పిల్లలతో సంతోషంగా జీవిస్తున్న ఆ దంపతుల మధ్య ఉన్నట్టుండి అనుకోని సమస్యలు వచ్చిపడ్డాయి. దీంతో అప్పటిదాకా సాఫీగా సాగిన సంసారం కాస్త.. సమస్యలకు నిలయంగా మారింది. ఈ క్రమంలో ఓ రోజు ఉన్నట్టుండి నలుగురు పిల్లలు మృతి చెందారు. వారిపై ఫ్యాన్ పడి ఉండడంతో అంతా కరెంట్ షాక్ వల్లే చనిపోయారని అనుకున్నారు. అయితే చివరకు పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఉన్నావ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని బరస్‌గవార్ పోలీస్ స్టేషన్ పరిధి లాల్‌మంఖేడా గ్రామానికి చెందిన వీరేంద్ర కుమార్ అనే వ్యక్తికి భార్య శివదేవి, కొడుకులు మయాంక్ (9), హిమాంక్ (60, మాన్షి(4, కూతురు హిమాన్షి (8) ఉన్నారు. సంతోషంగా సాగుతున్న కుటుంబంలో వీరేంద్ర చేసిన తప్పు కారణంగా సమస్యలు వచ్చి పడ్డాయి. గ్రామంలోని మరో మహిళతో వీరేంద్ర వివాహేతర సంబంధాన్ని (extramarital affair) కొనసాగిస్తున్నాడు. భార్యకు తెలీకుండా వ్యవహారం నడుపుతూ వచ్చాడు. అయితే ఇటీవల అతడి నిర్వాకం భార్యకు తెలిసింది. అప్పటి నుంచి దంపతుల మధ్య తరచూ గొడవలు (Quarrels between couples) జరుగుతున్నాయి. ఈ గొడవలు ఇటీవల ఇంకా ఎక్కువయ్యాయి. దీంతో వీరేంద్ర భార్యపై కోపం పెంచుకున్నాడు. ఆ కోపాన్నంతా అ పిల్లలపై చూపించాడు.

Viral Video: రైల్లో ఓ యువతి సీక్రెట్‌గా తీసిన ఈ వీడియోను చూస్తే గుండె తరుక్కుపోవడం ఖాయం.. తల్లిదండ్రులు అంధులే అయినా..!

uttar-pradesh-crime.jpg

ఈ క్రమంలో నవంబర్ 19న ఉన్నట్టుండి నలుగురు పిల్లలు ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు. వారిపై ఫ్యాన్ పడి ఉండడంతో విద్యుత్ షాక్ వల్లే చనిపోయారని అంతా అనుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో పిల్లలపై విష ప్రయోగం చేసి, గొంతు నులిమి చంపినట్లు తెలిసింది. ఆ మరుసటి రోజు వీరేంద్ర కుమార్ విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు తన భర్తే పిల్లలను చంపాడని శివదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వీరేంద్రను పోలీసులు విచారించగా.. పిల్లలను గొంతు నులిమి హత్య చేసినట్లు అంగీకరించాడు. అయితే తర్వాత మళ్లీ మాట మారుస్తుండడంతో.. చివరకు మళ్లీ రీపోస్టుమార్టం కోసం మృతదేహాలను తరలించారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Indian Railway: రైల్లో అర్ధరాత్రి ముగ్గురు కుర్రాళ్ల మందు పార్టీ.. వెనుక సీట్లోనే కూర్చున్న ఈమెకు విసుగొచ్చి..!

Updated Date - 2023-11-25T15:59:14+05:30 IST