Share News

Wife: ఛీ..ఛీ.. వీడసలు భర్తేనా..? భార్య నోట్లో చున్నీని కుక్కి.. ఆమెపై పెట్రోల్‌ను పోసి మరీ దారుణం.. అసలేం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2023-11-24T19:16:55+05:30 IST

దంపతుల మధ్య తలెత్తే చిన్న చిన్న గొడవలు కొన్నిసార్లు దారుణ ఘటనలకు దారి తీస్తుంటాయి. ఎక్కువగా వివాహేతర సంబంధాల విషయంలో ఇలాంటి గొడవలు జరుగుతుంటాయి. తాజాగా, ఛత్తీస్‌గఢ్‌‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యపై ...

Wife: ఛీ..ఛీ.. వీడసలు భర్తేనా..? భార్య నోట్లో చున్నీని కుక్కి.. ఆమెపై పెట్రోల్‌ను పోసి మరీ దారుణం.. అసలేం జరిగిందంటే..!
ప్రతీకాత్మక చిత్రం

దంపతుల మధ్య తలెత్తే చిన్న చిన్న గొడవలు కొన్నిసార్లు దారుణ ఘటనలకు దారి తీస్తుంటాయి. ఎక్కువగా వివాహేతర సంబంధాల విషయంలో ఇలాంటి గొడవలు జరుగుతుంటాయి. తాజాగా, ఛత్తీస్‌గఢ్‌‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యపై దారుణానికి పాల్పడ్డాడు. తాను చేసిన తప్పును నిలదీయడంతో భార్య చేతులు, కాళ్లు కట్టేశాడు. అంతటితో ఆగకుండా నోట్లో చున్నీని కుక్కి, ఆమెపై పెట్రోల్ పోసి మరీ దారుణానికి పాల్పడ్డాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) బలరాంపూర్ జిల్లా వాద్రాస్ నగర్ పోలీస్ పోస్ట్ ఏరియా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక మదన్‌పూర్ ప్రాంతంలో రాంప్రసాద్, నేహా (28) దంపతులు నివాసం ఉంటున్నారు. ఇదిలావుండగా, కొన్ని నెలల క్రితం రాంప్రసాద్‌కు స్థానిక ప్రాంతానికి చెందిన మరో మహిళతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఇది క్రమంగా వివాహేతర సంబంధానికి (extramarital affair) దారి తీసింది. కొన్నాళ్లకు ఈ విషయం నేహాకు తెలిసింది. దీంతో అప్పటినుంచి ఈ విషయంలో దంపతుల మధ్య గొడవలు (Quarrels between couples) జరుగుతున్నాయి. ఈ క్రమంలో నవంబర్ 20న కూడా దంపతుల మధ్య ఇదే విషయమై గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాంప్రసాద్.. నేహాను తీవ్రంగా కొట్టాడు. ఆపై ఆమె చేతులు, కాళ్లు కట్టేసి.. నోటిలో చున్నీని కుక్కేశాడు.

Indian Railway: రైల్లో అర్ధరాత్రి ముగ్గురు కుర్రాళ్ల మందు పార్టీ.. వెనుక సీట్లోనే కూర్చున్న ఈమెకు విసుగొచ్చి..!

man-crime-news.jpg

తర్వాత నేహాపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు పరుగుపరుగున అక్కడికి చేరుకున్నారు. అప్పటికే నేహా చాలా వరకు కాలిపోయింది. మంటలు ఆర్పి వారు ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు అంబికాపూర్‌లోని మెడికల్ కళాశాల ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి (woman died) చెందింది. ఈ విషయం తెలుసుకున్న రాంప్రసాద్ పరారయ్యాడు. నవంబర్ 23న అతడి సమాచారం అందుకున్న పోలీసులు చేజ్ చేసి పట్టుకున్నారు. నేరం అంగీకరించడంతో అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Viral Video: పోలీస్ స్టేషన్ ముందు స్కూటీని ఆపి.. ఓ మహిళ వింత నిర్వాకం.. డబ్బుల్ని నడిరోడ్డుపై విసిరేస్తూ..!

Updated Date - 2023-11-24T19:16:57+05:30 IST