Marriage: భర్తకు గుడ్‌బై.. 60 ఏళ్ల వృద్ధుడిని పెళ్లాడిన 28 ఏళ్ల యువతి.. ఈ వయసులో ఇదేం పనని కుటుంబమంతా వ్యతిరేకించినా..!

ABN , First Publish Date - 2023-05-18T19:41:27+05:30 IST

ప్రేమ ఎప్పుడు ఎవరిపై పుడుతుందో ఎవరూ చెప్పలేరు. అందుకే పెద్దలు ప్రేమ గుడ్డిదని అంటూ ఉంటారు. తండ్రి వయసున్న వ్యక్తిపై కొందరు యువతులు ప్రేమ పెంచుకుంటూ ఉంటారు. అలాగే తప్పు అని తెలిసినా.. మనువరాలు వయసున్న బాలికలతో వృద్ధులు ప్రేమాయణం సాగిస్తుంటారు. ఇలాంటి..

Marriage: భర్తకు గుడ్‌బై.. 60 ఏళ్ల వృద్ధుడిని పెళ్లాడిన 28 ఏళ్ల యువతి.. ఈ వయసులో ఇదేం పనని కుటుంబమంతా వ్యతిరేకించినా..!

ప్రేమ ఎప్పుడు ఎవరిపై పుడుతుందో ఎవరూ చెప్పలేరు. అందుకే పెద్దలు ప్రేమ గుడ్డిదని అంటూ ఉంటారు. తండ్రి వయసున్న వ్యక్తిపై కొందరు యువతులు ప్రేమ పెంచుకుంటూ ఉంటారు. అలాగే తప్పు అని తెలిసినా.. మనువరాలు వయసున్న బాలికలతో వృద్ధులు ప్రేమాయణం సాగిస్తుంటారు. ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వార్త ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ భర్తకు గుడ్‌బై చెప్పి.. 60 ఏళ్ల వృద్ధుడిని పెళ్లాడింది. ఈ వయసులో ఇదేం పనని కుటుంబమంతా వ్యతిరేకించినా ఆమె మాత్రం పట్టించుకోలేదు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) భదోహి జిల్లా గోపిగంజ్ కొత్వాలి పరిధి బీహరోజ్‌పూర్‌కు చెందిన 60 ఏళ్ల సుదైరామ్ యాదవ్‌కు భార్య, కొడుకు, కోడలు, మనువడు ఉన్నారు. సుదైరామ్ స్వతహాగా గాయకుడు. ఇదిలావుండగా, మజ్‌గవాన్ నివిహా ప్రాంతానికి చెందిన 28ఏళ్ల అష్రాఫీ దేవితో పరిచయం ఏర్పడింది. ఈమెకు వివాహమై భర్త కృష్ణ మురత్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అష్రాఫీ దేవి భర్త తమిళనాడులో (Tamil Nadu) పని చేస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడూ సొంతూరికి వచ్చి భార్య, పిల్లలను చూసుకుంటూ ఉండేవాడు. ఇటీవల సుదైరామ్ యాదవ్‌, అష్రాఫీ దేవి తరచూ కలుస్తూ ఉండేవారు.

Viral News: అమ్మ బాబోయ్.. ఏంటీ ఘోరం.. అమ్మాయే కానీ మగాడినంటూ రెండేళ్ల పాటు ప్రేయసిని నమ్మించింది..!

ఇలా వీరి మధ్య వివాహేతర సంబంధం (extramarital affair) ఏర్పడింది. ఎలాగైనా కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల వీరు ఇంటి నుంచి వెళ్లిపోయి ఆలయంలో వివాహం చేసుకున్నారు. అష్రాఫీ దేవి కనిపించకపోవడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎట్టకేలకు బుధవారం ఇద్దరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తీసుకొచ్చారు. ఇరువైపు కుటుంబ సభ్యులు స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే అష్రాఫీ దేవి మాత్రం సుదైరామ్ యాదవ్‌‌తోనే ఉంటానని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో (Viral news) వైరల్‌గా మారింది.

Viral Video: బాబోయ్! పడుకున్న మనిషిపై నిప్పు వెలిగించి మరీ మసాజ్.. చివరికి ఏమైందో చూడండి..

Updated Date - 2023-05-18T19:41:27+05:30 IST