Viral Video: బాబోయ్! పడుకున్న మనిషిపై నిప్పు వెలిగించి మరీ మసాజ్.. చివరికి ఏమైందో చూడండి..

ABN , First Publish Date - 2023-05-18T18:19:06+05:30 IST

రోజురోజుకూ మారుతున్న టెక్నాలజీతో పాటే అన్ని రంగాల్లోనూ వినూత్న మార్పులు వస్తున్నాయి. మరోవైపు ప్రస్తుత ఉరుకు పరుగుల జీవితంలో చాలా మంది వివిధ కారణాలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటే.. మరికొందరు..

Viral Video: బాబోయ్! పడుకున్న మనిషిపై నిప్పు వెలిగించి మరీ మసాజ్.. చివరికి ఏమైందో చూడండి..

రోజురోజుకూ మారుతున్న టెక్నాలజీతో పాటే అన్ని రంగాల్లోనూ వినూత్న మార్పులు వస్తున్నాయి. మరోవైపు ప్రస్తుత ఉరుకు పరుగుల జీవితంలో చాలా మంది వివిధ కారణాలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటే.. మరికొందరు నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తుంటారు. ఇంకొందరు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు బాడీ మసాజ్ సెంటర్లకు వెళ్తుంటారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు మసాజ్ సెంటర్ల నిర్వాహకులు కూడా.. వివిధ రకాల పద్ధతుల్లో మసాజ్‌లు చేస్తుంటారు. ఇలాంటి మసాజ్‌లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పడుకున్న వ్యక్తిపై నిప్పు పెట్టి మరీ మసాజ్ చేశాడు. చివరికి ఏమైందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral videos) తెగ వైరల్ అవుతోంది. మసాజ్ సెంటర్‌కి (Massage Center) వెళ్లిన వ్యక్తిని ముందుగా బోర్లా పడుకోబెట్టి, అతడిపై మందపాటి తెల్ల దుప్పటిని కప్పేస్తాడు. తర్వాత దానిపై ఏదో రసాయనం పూసి చివరగా నిప్పంటిస్తాడు. దీంతో మంటలు అతడి కాళ్ల మీదుగా మొత్తం వ్యాపిస్తాయి. తర్వాత మసాజ్ చేసే వ్యక్తి చేతిలో నల్లటి పలక తరహాలో ఉన్న వస్తువు పట్టుకుని, మంటల్లో ఏదో చల్లుతూ అటూ ఇటూ తిరుగుతాడు. ఇలా కొద్ది సేపు తల నుంచి పాదాల వరకూ మంటలపై చల్లూతూ ఉంటాడు. చివరగా అతడు సైగ చేయగానే ఇంకో వ్యక్తి అక్కడికి వచ్చి.. మంటలపై మరో తెల్లటి దుప్పటిని కప్పుతాడు. దీంతో మంటలు పూర్తిగా ఆరిపోతాయి.

Crime News: ఈ 33 ఏళ్ల కుర్రాడి గూగుల్ హిస్టరీతోనే 42 ఏళ్ల మహిళ మర్డర్ మిస్టరీ వీడింది.. ఇంతకీ ఇతడు ఫోన్లో ఏం సెర్చ్ చేశాడో తెలిస్తే..!

చైనాతో (China) పాటూ చాలా దేశాల్లో ఇలాంటి ఫైర్ థెరపీ చికిత్స (Fire therapy treatment) చేయడం ఆనవాయితీగా వస్తోంది. హెమటిజం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, జాయింట్ బెణుకులు, ట్యూమర్‌లు, జీర్ణ సమస్యలు, గైనకాలజీ తదితర వ్యాధులకు ఇలాంటి చికిత్సను చేస్తుంటారు. ఆల్కహాల్‌లో (Alcohol) నానబెట్టిన టవల్స్‌కు నిప్పంటించి, శరీరంపై సుమారు 30 సెకన్ల నుండి నిమిషం వరకు ఉంచుతారు. తర్వాత మంటల్లో కొన్ని మూలికలను చల్లుతారని తెలిసింది. ఇలాంటి థెరపీకి సుమారు రూ.500 నుంచి రూ.1000 వరకు ఖర్చు అవుతుందని సమాచారం. ఇదిలావుండగా, మంటలతో చేసిన మసాజ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral News: అమ్మ బాబోయ్.. ఏంటీ ఘోరం.. అమ్మాయే కానీ మగాడినంటూ రెండేళ్ల పాటు ప్రేయసిని నమ్మించింది..!

Updated Date - 2023-05-18T18:19:06+05:30 IST