Crime News: నట్టింట్లో తల్లిదండ్రుల మృతదేహాలు.. కొడుకు చేతికి గాయం చూసి పోలీసులకు డౌట్.. చివరకు ఊహించని ట్విస్ట్..!

ABN , First Publish Date - 2023-05-17T16:06:49+05:30 IST

హత్య, ఆత్మహత్యలకు సంబంధించిన చాలా కేసులు.. పోలీసులకు తలనొప్పిగా మారుతుంటాయి. కొన్ని కేసులైతే ఏళ్లకు ఏళ్లు పెండింగ్‌లో పడుతుంటాయి. మరికొన్ని కేసులు గంటల వ్యవధిలోనే పరిష్కారం అవుతుంటాయి. ఎంత మిస్టరీ కేసు అయినా..

Crime News: నట్టింట్లో తల్లిదండ్రుల మృతదేహాలు.. కొడుకు చేతికి గాయం చూసి పోలీసులకు డౌట్.. చివరకు ఊహించని ట్విస్ట్..!
ప్రతీకాత్మక చిత్రం

హత్య, ఆత్మహత్యలకు సంబంధించిన చాలా కేసులు.. పోలీసులకు తలనొప్పిగా మారుతుంటాయి. కొన్ని కేసులైతే ఏళ్లకు ఏళ్లు పెండింగ్‌లో పడుతుంటాయి. మరికొన్ని కేసులు గంటల వ్యవధిలోనే పరిష్కారం అవుతుంటాయి. ఎంత మిస్టరీ కేసు అయినా కొన్నిసార్లు చిన్న చిన్న క్లూతో అసలు నిందితులు దొరికిపోతుంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల విషాద ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రుల మృతదేహాలు నట్టింట్లో పడి ఉన్నాయి. పరిశీలించే క్రమంలో కొడుకు చేతిపై ఉన్న గాయం చూసి పోలీసులకు అనుమానం కలిగింది. చివరకు ఈ కేసులో ఊహించని ట్విస్ట్ బయటపడింది. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మీరట్ పరిధి శాస్త్రి నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ప్రమోద్ అనే వ్యక్తికి భార్య మమత, కొడుకు ఆర్యన్, కూతురు కనిష్క ఉన్నారు. కూతురు గురుగ్రామ్‌లోని ఓ విదేశీ కంపెనీలో పని చేస్తోంది. జీతం లక్షల్లో ఉండడంతో తల్లిదండ్రులను బాగా చూసుకునేది. అయితే కొడుకు ఆర్యన్ మాత్రం ఖాళీగా ఉండడంతో పాటూ మద్యానికి బానిస (Alcoholic) అయ్యాడు. ఈ క్రమంలో ఇటీవల వీరి ఇంట్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వంట విషయంలో ప్రమోద్.. తన భార్యతో తరచూ గొడవ (Quarrel with wife) పడేవాడు. ఇటీవల తరచూ గొడవ పడుతుండడం చూసి.. కొడుక్కి తండ్రిపై కోపం వచ్చింది. తండ్రికి ఎంత చెప్పినా తల్లితో గొడవ పడుతున్నాడనే కారణంతో పగ పెంచుకున్నాడు. సోమవారం ఆర్యన్ తన తండ్రి ప్రమోద్‌తో కలిసి మద్యం సేవించాడు.

Viral News: ఒకరికి 25 ఏళ్లు.. మరొకరికి 50 ఏళ్ల వయసు.. ఇద్దరూ తల్లీకూతుళ్లే.. సడన్‌గా ఎందుకు వార్తల్లోకి ఎక్కారంటే..

ఈ క్రమంలో కావాలనే గొడవ పెట్టుకుని చివరకు తండ్రిపై విచక్షణా రహితంగా (Son attacks father) దాడి చేశాడు. ఈ దాడిలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి అడ్డుగా రావడంతో ఆమెపై కూడా దాడి చేసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఈ క్రమంలో కొడుకు చేతిపై ఉన్న గాయం చూశారు. అయితే బైకుపై నుంచి కిందపడ్డానని అతను చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అదుపులోకి తీసుకుని గట్టిగా విచారించగా నేరం అంగీకరించాడు. దీంతో అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా, మే 23న ప్రమోద్ వివాహ వార్షికోత్సవం కావడంతో కూతురు వీరికి కారును గిఫ్ట్‌గా ఇవ్వాలని బుక్ చేసింది. అయితే అప్పటికే కొడుకు చేతిలో వారు హత్యకు గురవడం అందరినీ కంటతడి పెట్టించింది. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

Viral News: ఎంతకు తెగించావురా బుడ్డోడా.. ఎలాగైనా బైక్ కొనుక్కునేందుకు తండ్రికే ఎసరు పెట్టాడు..!

Updated Date - 2023-05-17T16:06:49+05:30 IST