Crime News: బెడ్రూంలో 22 ఏళ్ల యువతి మృతదేహం.. మంచంపై నుంచి కిందకు దించుతోంటే బయటపడిన కాగితం.. ఏం రాసి ఉందో చదివి..!

ABN , First Publish Date - 2023-05-16T18:12:27+05:30 IST

యువతీయువకులకు ఎక్కువగా ప్రేమ వ్యవహారాల్లోనే గొడవలు తలెత్తుంటాయి. ప్రేమించలేదని కొందరు, వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారని మరికొందరు ఒకరిపై ఇంకొకరు కోపం పెంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో చివరకు కొందరు దారుణాలకు పాల్పడుతుంటారు. తాజాగా..

Crime News: బెడ్రూంలో 22 ఏళ్ల యువతి మృతదేహం.. మంచంపై నుంచి కిందకు దించుతోంటే బయటపడిన కాగితం.. ఏం రాసి ఉందో చదివి..!
ప్రతీకాత్మక చిత్రం

యువతీయువకులకు ఎక్కువగా ప్రేమ వ్యవహారాల్లోనే గొడవలు తలెత్తుంటాయి. ప్రేమించలేదని కొందరు, వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారని మరికొందరు ఒకరిపై ఇంకొకరు కోపం పెంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో చివరకు కొందరు దారుణాలకు పాల్పడుతుంటారు. తాజాగా, రాజస్థాన్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. బెడ్రూంలో 22 ఏళ్ల యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మంచంపై నుంచి మృతదేహాన్ని కిందకు దింపే క్రమంలో ఓ కాగితం బయటపడింది. అందులో రాసింది చూసిన పోలీసులు చివరకు ఏం చేశారంటే..

రాజస్థాన్ (Rajasthan) సవాయ్ మాధోపూర్ జిల్లా బర్వాడా పోలీస్ స్టేషన్ పరిధి శివద్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన అజయ్ అనే యువకుడికి.. ఇదే ప్రాంతానికి చెందిన పూజ బైర్వా (22) అనే యువతితో (young woman) పరిచయం ఏర్పడింది. అజయ్ ఆమెపై ప్రేమ (love) పెంచుకున్నాడు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఇటీవల ఓ రోజు పూజకు ఫోన్ చేసి.. ‘‘నివ్వంటే నాకు ఇష్టం.. ఐ లవ్ యూ’’.. అని చెప్పాడు. ఇందుకు ఆమె ‘‘ నిన్ను నేను ఆ ఉద్దేశంతో చూడలేదు.. దయచేసి ఇలాంటి పనులు మానుకో’’.. అని చెప్పడంతో అజయ్ మానసిక ఒత్తిడికి గురయ్యాడు.

Viral News: ఈ ముగ్గురినీ కన్న తల్లిదండ్రులు ఎవరో కానీ.. చాలా అదృష్టవంతులు.. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందో తెలిస్తే..

యువతిని తరచూ కలుస్తూ.. పదే పదే ఫోన్లు చేస్తూ ప్రేమించాలంటూ వెంటపడేవాడు. దీంతో విసిగిపోయిన యువతి.. ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘ఇంకోసారి నాకు ఫోన్ చేశావంటే మర్యాదగా ఉండదు’’.. అని గట్టిగా మందలించింది. అప్పటినుంచి అజయ్ ఆమెపై పగ పెంచుకున్నాడు. దీనికితోడు ఇటీవల సదరు యువతి రాజు అనే యువకుడిని ప్రేమిస్తోందని విని మరింత పగ పెంచుకున్నాడు. ఎలాగైనా పూజను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. మే 11న రాత్రి యువతి ఇంట్లోకి ప్రవేశించి, ఇదే విషయమై గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా కత్తితో (man Attack on young woman) ఆమెపై దాడి చేశాడు.

Viral Video: నిద్రపోతున్న తల్లి పక్కన.. దుప్పటి కప్పుకొని ఏదో చెయ్యాలనుకుంది.. చివరికి ఏమైందో మీరే చూడండి..

ఈ దాడిలో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ కేసును రాజు మీద వెళ్లేలా చేసేందుకు.. ఓ కాగితంపై రాజు పేరు రాసి మంచం కింద పడేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో కాగితంపై ఉన్న పేరు చూసి రాజును అదుపులోకి తీసుకుని ప్రశించారు. చివరగా పూజ ఫోన్ కాల్స్ లిస్ట్ పరిశీలించడంతో అజయ్ పేరు బయటికి వచ్చింది. చివరకు అతన్ని అదుపులోకి తీసుకుని గట్టిగా విచారించడంతో నేరం అంగీకరించాడు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Viral News: ఒకరికి 25 ఏళ్లు.. మరొకరికి 50 ఏళ్ల వయసు.. ఇద్దరూ తల్లీకూతుళ్లే.. సడన్‌గా ఎందుకు వార్తల్లోకి ఎక్కారంటే..

Updated Date - 2023-05-16T18:13:37+05:30 IST