Home » Love
ఇన్స్టాగ్రామ్ వేదికగా యువతులను, ముఖ్యంగా సంపన్న కుటుంబాలకు చెందిన అమ్మాయిలను మాయమాటలతో ట్రాప్ చేసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ముఠా గుట్టును జూబ్లీహిల్స్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న అర్జున్, అతని సోదరుడు రాజీవ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతపురంలో మరో వలపువల వెలుగులోకి వచ్చింది. గుత్తి టౌన్కు రావాలంటూ పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన యువకుడికి ఇన్స్టాగ్రామ్లో కర్నూలు జిల్లా జొన్నగిరికి చెందిన యువతి వలపు వల వేసింది. ఈ క్రమంలో ఆ యువకుడు గుత్తి టౌన్కు చేరుకున్నారు.
మహిళను ఇంటికి తీసుకురావడానికి బంధువులు ఒప్పుకోకపోవటంతో ఓ యువకుడు దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. బ్లేడుతో గొంతు కోసుకుని ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించాడు.
ప్రేయసితో పెళ్లి జరిపించాలని పెట్రోల్ డబ్బాతో ఒక యువకుడు హైటెన్షన్ టవర్ ఎక్కాడు. బోరబండ పోలీసులు అతడితో మాట్లాడాక కిందికి దిగాడు.
అనంతపురం నగరంలో వెలుగులోకి వచ్చిన హనీట్రాప్ కేసు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సంపన్న వర్గాలు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, రియల్టర్లను లక్ష్యంగా చేసుకుని ఒక ముఠా వ్యవహరించిన తీరుపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ప్రేమ వివాహం చేసుకున్న ఏడాదిలోపే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తిరుచ్చి జిల్లా రెడ్డియాపట్టి పెరుమాళ్ ఆలయ వీధికి చెందిన పొన్నర్-షాలిని (24) ప్రేమించుకోగా, వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వీరిద్దరూ గత ఏడాది వివాహం చేసుకున్నారు.
నాసిక్లో జరిగిన ‘లవ్ జిహాద్’ ఆరోపణల కేసు నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేశారు.
ఖాజీపేట విద్యార్థిని రామకీర్తనను చంపిన ప్రేమోన్మాది వెంకటేష్పై పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల ఘటనపై కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ స్పందించారు.
ప్రేమోన్మాది వెంకటేష్పై పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడిని మైదుకూరు నుంచి తీసుకెళుతుండగా.. బాసాపురం చెక్పోస్ట్ దగ్గర పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతడిని అడ్డుకోవటంతో వారిపై దాడి చేశాడు. ఈ నేపథ్యంలోనే సీఐ వంశీధర్ నిందితుడిపై కాల్పులు జరిపారు.
కడప జిల్లా ఖాజీపేట మండలంలో మనసును కలచివేసే దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వెంటపడి, చివరకు బాలిక ప్రాణాలనే బలిగొన్న ఓ ప్రేమోన్మాది ఘాతుకం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.