హెచ్-1బీ వీసాకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి పలుమార్పులు రాబోతున్నాయని యూఎస్సీఐఎస్ పేర్కొంది. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇరాన్పై దాడుల విషయంలో తమకు సహకరించని దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మండిపడ్డారు. ఆయా దేశాలు హోర్ముజ్కు వెళ్లి తమ ముడి చమురును తామే తెచ్చుకోవాలని అన్నారు. అమెరికా ఎల్లకాలం సాయం చేయదని చెప్పారు.
తీవ్ర ఇంధన కొరతతో సతమతమవుతున్న క్యూబాకు రష్యా ఉపశమనం కలిగించింది. లక్ష టన్నుల ఇంధనాన్ని క్యూబాకు చేరవేసింది. అమెరికా విధించిన ఆంక్షలతో క్యూబాలో తీవ్ర ఇంధన కొరత, విద్యుత్ కోతలు నెలకొన్న సంగతి తెలిసిందే.
ఇరాన్పై దాడులను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న స్పెయిన్ తాజాగా అమెరికాకు మరో షాకిచ్చింది. ఇరాన్తో యుద్ధంలో పాలుపంచుకుంటున్న అమెరికన్ యుద్ధ విమానాలను తమ గగనతలంలోకి రాకుండా నిషేధించింది.
తమతో ఇరాన్ త్వరగా డీల్ కుదుర్చుకోకపోతే విధ్వంసం తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. ఇరాన్తో చర్చల్లో పురోగతి కూడా ఉందని అన్నారు.
ట్రంప్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ఇకపై న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయకుండా ఉండేలా మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారు. న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయడానికి ఇరాన్ సిద్ధం చేసిపెట్టుకున్న 400 కేజీల యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు.
ఇరాన్కు అత్యంత కీలకమైన, ఆర్థిక జీవనాడి అయిన ఖర్గ్ ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఒక్కసారి తీవ్ర దాడులు మొదలుపెడితే, ఖర్గ్ ద్వీపాన్ని చాలా తేలికగా స్వాధీనం చేసుకుంటామని అన్నారు.
ఇరాన్లోని మినాబ్లో ఎలిమెంటరీ స్కూలుపై ఇటీవల అమెరికా క్షిపణి దాడి జరిపి 170 మంది ప్రాణాలను బలిగొన్న సంఘటన టెహ్రాన్-వాషింగ్టన్ మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ఈ క్షిపణిని ప్రయోగించిన అమెరికా నౌకాదళ అధికారుల ఫోటోలను ఇరాన్ తాజాగా విడుదల చేసింది.
ఇటీవల ఇరాన్ జరిపిన మిసైల్ దాడిలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సౌదీ అరేబియాలోని వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో యూఎస్కు చెందిన అవాక్స్ నిఘా విమానం ధ్వంసమైంది.
దుబాయ్లోని అమెరికాకు చెందిన రెండు రహస్య స్థావరాలపై దాడులు చేసినట్టు ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ వెల్లడించింది. ఆ రహస్య స్థావరాల్లో దాదాపు 500 మంది అమెరికా సైనికులు ఉన్నారని, భారీ ప్రాణనష్టం సంభవించిందని ఐఆర్జీసీ వెల్లడించింది.