ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు దేశాల దౌత్య ప్రతినిధులు వాషింగ్టన్ డీసీలో...
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతున్నాయి. హోర్ముజ్ జలసంధి వద్ద కొనసాగుతున్న నిర్బంధంపై ఇరాన్ తాజాగా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ నిర్బంధం ఇలాగే కొనసాగితే వేలాది మంది అమెరికా సైనికులను బందీలుగా తీసుకునే అవకాశం ఉందని ఇరాన్ స్పష్టం చేసింది.
ఇరాన్ ముడి చమురు రంగంపై యూఎస్ తాజాగా మరిన్ని ఆంక్షలు విధించింది. షమ్ఖానీ నెట్వర్క్కు చెందిన పలు సంస్థలు, వ్యక్తుల కార్యకలాపాలను కట్టడి చేసినట్టు యూఎస్ ట్రెజరీ తాజాగా ప్రకటించింది.
చైనా నుంచి తీసుకున్న శాటిలైట్తో ఇరాన్ యూఎస్ స్థావరాలపై నిఘా పెట్టినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇరాన్కు తాము ఆయుధాలు పంపడం లేదని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్పష్టం చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం వెల్లడించారు. ఇరాన్కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తోందన్న వార్తలు కొద్ది రోజులుగా వెలువడుతున్న సంగతి తెలిసిందే.
ఇస్లామాబాద్ వేదికగా రెండోసారి అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగబోతున్నాయి. ఆ చర్చలు వారం రోజుల్లోపే ఉండొచ్చని ట్రంప్ తెలిపారు. సరైన వ్యక్తులు వాషింగ్టన్ను పిలిచారని, వారు ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని కోరుకుంటున్నారని ట్రంప్ పేర్కొన్నారు.
ఇరాన్తో చేస్తున్న యుద్ధం అమెరికాకు అటు ఆర్థికంగా, ఇటు సైనిక పరంగా తీవ్ర నష్టాలను కలిగిస్తోంది. అంతేకాదు.. ఇరాన్తో చేస్తున్న యుద్ధం పట్ల చాలా మంది అమెరికన్లు ఆగ్రహంగా ఉన్నారు. తాజా సర్వేల ప్రకారం ఎక్కువ మంది అమెరికన్లు ఇరాన్తో యుద్ధం చేయడం వల్ల ప్రయోజనం లేదని భావిస్తున్నారు.
అమెరికా దిగ్బంధనం కొనసాగుతున్నప్పటికీ చైనా నౌక ఒకటి హోర్ముజ్ను దాటినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
మరో రెండు రోజుల్లో యూఎస్, ఇరాన్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వారం కాల్పుల విరమణ గడువు ముగిసే లోపే మళ్లీ చర్చలు ప్రారంభించాలని ఇరు వర్గాలు యోచిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి
హోర్ముజ్ జలసంధిని యూఎస్ దిగ్బంధించడంపై సౌదీ అరేబియా ఆందోళనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చర్యలతో ఇరాన్ మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నట్టు సమాచారం.