ఇటీవల ఇరాన్ జరిపిన మిసైల్ దాడిలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సౌదీ అరేబియాలోని వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో యూఎస్కు చెందిన అవాక్స్ నిఘా విమానం ధ్వంసమైంది.
దుబాయ్లోని అమెరికాకు చెందిన రెండు రహస్య స్థావరాలపై దాడులు చేసినట్టు ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ వెల్లడించింది. ఆ రహస్య స్థావరాల్లో దాదాపు 500 మంది అమెరికా సైనికులు ఉన్నారని, భారీ ప్రాణనష్టం సంభవించిందని ఐఆర్జీసీ వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ అమెరికా ప్రజలు భారీ సంఖ్యలో 'నో కింగ్స్' నిరసనలు చేపట్టారు. ట్రంప్ వెంటనే తన పదవిని వీడాలని డిమాండ్ చేశారు. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నిరసనగా మారుతుందని నిర్వాహకులు తెలిపారు.
పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య చర్చ జరిగింది. గత మంగళవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్ చేసి ఇరాన్ విషయమై చర్చించారు.
ఇరాన్పై అనుకున్న సమయం కంటే ముందే దాడులను ముగిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో అన్నారు. మరికొన్ని వారాల్లో ఇరాన్ యుద్ధం ముగుస్తుందని తెలిపారు. ఇరాన్పై భూతల దాడులు చేయాల్సిన అవసరం లేకుండానే తమ లక్ష్యాలను సాధిస్తామని అన్నారు.
ట్రంప్ తనయుడు బారెన్ ట్రంప్తో స్నేహం చేసిన యువతిపై అసూయతో దాడి చేసిన ఓ వ్యక్తిపై యూకే కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. దాడి జరుగుతున్న వైనాన్ని వీడియో కాల్లో చూసి పోలీసులకు సమాచారం ఇచ్చిన బారెన్ ట్రంప్ను న్యాయమూర్తి ప్రశంసించారు.
హోర్ముజ్ జలసంధిని ట్రంప్ జలసంధి అంటూ అమెరికా అధ్యక్షుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. యుద్ధ విరమణ ఒప్పందం కోసం ఇరాన్ అమెరికాను వేడుకుంటోందని కూడా చెప్పుకొచ్చారు.
గత మంగళవారం జరిగిన ట్రంప్-మోదీ ఫోన్ కాల్లో టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ కూడా పాల్గొన్నట్టు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే, ఇరు దేశాధినేతలతో మస్క్ ఏం మాట్లాడారనే విషయంలో మాత్రం తెలియరాలేదు.
అమెరికాలోని ఐటీ పారిశ్రామికవేత్తలతో ఏపీటీఎస్ ఛైర్మన్ మోహన కృష్ణ సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టి.. రాష్ట్ర ప్రగతి పథంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా వారికి పిలుపునిచ్చారు.
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ కాష్ పటేల్ వ్యక్తిగత ఈమెయిల్ హ్యాక్ అయింది. తామే ఈ హ్యాకింగ్కు పాల్పడినట్టు ఇరాన్కు చెందిన హండాలా హ్యాక్ టీమ్ ప్రకటించింది.