మరోసారి ఇరాన్పై అమెరికా దాడులు.. కొనసాగుతున్న ఉద్రిక్తత..
ABN , Publish Date - Jul 09 , 2026 | 07:12 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్పై అమెరికా మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో కనీసం ఒకరు మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్పై అమెరికా మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో కనీసం ఒకరు మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దాడులు జరిగాయి. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది (US Iran War).
ఇరాన్తో పోరాటాన్ని నిలిపివేయడానికి గత నెలలో కుదిరిన మధ్యంతర ఒప్పందం ముగిసిపోయిందని తాను నమ్ముతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన కొన్ని గంటల తర్వాత ఈ దాడులు జరిగాయి. 'హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛకు ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని మరింత బలహీనపరిచేందుకు, యూఎస్ సెంట్రల్ కమాండ్ దళాలు ఆ దేశంపై అదనపు దాడులు ప్రారంభించాయి' అని యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) ఎక్స్ ద్వారా తెలిపింది (US Military attacks).
'కీలకమైన అంతర్జాతీయ జలమార్గంలో స్వేచ్ఛగా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలు, పౌర సిబ్బందిపై ఇటీవల అన్యాయమైన దురాక్రమణ చేసిన ఇరాన్కు అమెరికా తగిన బుద్ధి చెబుతోంది' అని సెంట్కామ్ పేర్కొంది. టర్కీలోని అంకారాలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశం నుంచి తిరిగి వస్తూ, ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ (Trump about Iran) విలేకరులతో మాట్లాడారు. 'కొద్దిసేపటి క్రితం వాళ్లు ఫోన్ చేశారు, ఒప్పందం చేసుకోవాలని వాళ్లు చాలా బలంగా కోరుకుంటున్నారు. కానీ వాళ్లు ఒప్పందానికి అర్హులో కాదో నాకు తెలియడం లేదు' అని ట్రంప్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రిషికొండ భవనాలు ఎవరికీ కేటాయించలేదు