Home » Iran War
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ మొజ్తాబా ఖమేనీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మొజ్తాబా బతికిలేడనడానికి 90 శాతం అవకాశం ఉందని అన్నారు.
ఇరాన్, అమెరికా దేశాల మధ్య జూన్ నెలలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ తూట్లు పొడిచింది. తమ అనుమతి లేకుండా హోర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న నౌకలపై దాడులు చేస్తోంది. తాజాగా, హోర్ముజ్ జలసంధిలోని ఒమన్ ప్రాంతీయ జలాల్లో ప్రయాణిస్తున్న రెండు యూఏఈ ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడులు చేసింది.
ఇరాన్లోని సబ్మెరైన్, యుద్ధ నౌకల మరమ్మతుల కేంద్రంపై అమెరికా దాడి చేసింది. పలు సముద్రపు డ్రోన్లతో ఈ దాడి చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా తెలిపింది.
అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ ముదురుతున్నాయి. గతంలో శాంతి స్థాపన కోసం అమెరికాతో కుదిరిన అవగాహన ఒప్పందాన్ని అమలు చేసేది లేదని ఇరాన్ తాజాగా తేల్చిచెప్పింది.
ఇరాన్లో అతివాద వైఖరికి పేరుగాంచిన హమ్షహ్రీ పత్రిక ప్రచురించిన ఒక కథనం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది.
అమెరికా జరిపిన తాజా సైనిక దాడులపై ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ దాడులు ఐక్యరాజ్యసమితి చార్టర్ను ఉల్లంఘించడమేనని అభివర్ణించిన ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, వాషింగ్టన్ చర్యలు ప్రాంతీయ స్థిరత్వాన్ని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని దెబ్బతీస్తున్నాయని ఆరోపించింది.
ఇరాన్ అణు వివాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు ప్రపంచం ముందు ఉంచారు. ఇరాన్తో ఇతర మార్గాలను అన్వేషించే ముందు, చర్చల ద్వారా దౌత్యపరమైన ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్లు నెతన్యాహు వెల్లడించారు.
హోర్మూజ్ జలసంధి చుట్టూ హైటెన్షన్ పరిస్థితులు నెలకొనడంతో ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని ఖతార్ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆ దేశ వాణిజ్య నౌకల యాజమాన్యాలను ఆదేశించింది.
హోర్ముజ్ జలసంధి చుట్టూ మళ్లీ మడత పేచీ మొదలైంది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు నిన్న ఇరాన్ ప్రకటించగా, ఆ ప్రకటనను అమెరికా సెంట్రల్ కమాండ్ ఇవాళ పూర్తిగా తోసిపుచ్చింది.
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ముగిశాయి. అయితే.. ఇప్పుడు చర్చంతా అందులో పాల్గొన్న ఓ వ్యక్తి గురించే నడుస్తోంది. ముఖానికి మాస్క్ ధరించి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నదెవరనే విషయం సర్వత్రా ప్రశ్నార్థకమవుతోంది.