Home » Iran War
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. ఇరాన్ కారణంగా గత ఐదు దశాబ్దాల్లో అమెరికాకు జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలకు పరిహారం చెల్లించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు.
ఇరాన్తో పాక్షిక స్థాయి చర్చలు జరుగుతున్నాయని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా సైన్యం మరో వార్నింగ్ ఇచ్చింది. పశ్చిమాసియాలో ఇప్పటికీ 20కిపైగా యుద్ధనౌకలు సిద్ధంగానే ఉంచామని చెప్పింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో యుద్ధం విషయంలో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అణు ఒప్పందం లేకుండానే ఆయన యుద్ధాన్ని ముగించాలని భావిస్తున్నారని సమాచారం.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్నాయా? ఇరాన్పై మరో దాడి జరగబోతోందా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా వర్గాలు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్ సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది.
సౌదీ అరేబియాలోని కీలక చమురు క్షేత్రంపై మరోసారి జరిగిన దాడి కలకలం రేపింది. సౌదీ అరామ్కోకు చెందిన జజాన్ చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్లతో దాడి చేసినట్లు యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు.
ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తాబా అలీ ఖమేనీ పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని, త్వరలో చనిపోతాడని ఇజ్రాయెల్ మీడియా చేస్తున్న ప్రచారంపై ఇరాన్ స్పందించింది. ప్రభుత్వానికి చెందిన సెమీ అఫిషియల్ న్యూస్ ఏజెన్సీ మెహర్.. మొజ్తాబాకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది.
యూఎస్ తన పద్ధతిని మార్చుకోనంత వరకూ హోర్ముజ్ జలసంధి తెరుచుకోదని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తాజాగా స్పష్టం చేసింది.
ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు ప్రచురించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.
ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం అమెరికా అగ్రనాయకుల మధ్య విభేదాలకు కారణమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత నాలుగు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణులు, వైమానిక రక్షణ వ్యవస్థలకు సంబంధించిన నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని వార్తలు వచ్చాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. హోర్ముజ్ను తెరవడం గురించి ఇరాన్-ఒమన్ మధ్య కొనసాగుతున్న చర్చలు సానుకూలంగా మారాయి.