ఇరాన్తో అమెరికా చర్చలు జరపనున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అంతర్జాతీయ జలమార్గాలను బ్లాక్ చేయడం తప్ప.. ఇరాన్ దగ్గర మరో ఆస్త్రం లేదని అన్నారు.
పశ్చిమాసియాలో జరిగిన యుద్ధం ప్రపంచ దేశాలకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగించింది. ఆసియా దేశాలు చమురు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఇక, ఇరాన్పై దాడికి తెగబడిన అమెరికా కూడా భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ యుద్ధం కోసం అమెరికా భారీగా ఖర్చు పెట్టింది.
పాక్కు బయలుదేరిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్కు గట్టి హెచ్చరిక చేశారు. తమతో గేమ్స్ వద్దని స్పష్టం చేశారు. అయితే, చర్చలు సానుకూలంగానే సాగుతాయని తాము ఆశిస్తున్నామని తెలిపారు.
హోర్ముజ్ జలసంధి గగనతలంలో అమెరికన్ డ్రోన్ కనిపించకుండా పోవడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. నిఘా మిషన్ అనంతరం డ్రోన్ ఇరాన్ వైపు మళ్లిన తరువాత కనిపించకుండా పోయినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
హోర్ముజ్ జలసంధి భద్రతపై స్పష్టమైన ప్రణాళికలు సమర్పించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐరోపా దేశాలకు స్పష్టం చేశారు. ప్రకటనలతో సరిపెడితే కుదరదని తేల్చి చెప్పారు.
హోర్ముజ్ జలసంధి మీదుగా రవాణాకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని ఐరోపా సమాఖ్య గురువారం స్పష్టం చేసింది. రవాణాకు స్వేచ్ఛ ప్రజావసరమని పేర్కొంది.
యూఎస్తో చర్చల్లో భాగంగా తమ హక్కులకు రక్షణ అవసరమని ఇరాన్ అణు ఇంధన సంస్థ చీఫ్ మొహమ్మద్ ఎస్లామీ అభిప్రాయపడ్డారు.
హోర్ముజ్ను మూసేసినట్టు ఇరాన్ మళ్లీ ప్రకటించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. హోర్ముజ్ వైపు ప్రయాణిస్తున్న అనేక సరకు రవాణా నౌకలు వెనక్కు మళ్లుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ పూర్తిగా ఒప్పందాన్ని అమలు చేసే వరకు అమెరికా సైనిక బలగాలు అక్కడే కొనసాగుతాయని తెలిపారు.
ఇరాన్పై చేపట్టిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' విజయవంతమైందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. కాల్పుల విరమణకు ఇరాన్ ప్రాథేయపడటంతో ట్రంప్ దయ చూపించారని చెప్పారు.