అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధ సమయంలో ఇరాన్కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్టు వెలువడిన నివేదికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్కు ఆయుధాలు పంపితే చైనా తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇస్లామాబాద్లో 21 గంటల పాటు జరిగిన కీలక చర్చలు ఫలితం లేకుండా ముగిశాయి
ఇరాన్తో డీల్ కుదరలేదన్న యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలపై ఇరాన్ ఎంబసీ స్పందించింది. యుద్ధంలో సాధించలేనిది చర్చలతో సాధించాలని యూఎస్ భావిస్తుండటంతో చర్చలు విఫలమయ్యాయని పేర్కొంది.
ఇస్లామాబాద్ వేదికగా పాక్తో చర్చలు జరుపుతున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఇరాన్తో ఎటువంటి డీల్ కుదరలేదని తెలిపారు.
చంద్రుడిపై మరోసారి కాలు మోపాలన్న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా లక్ష్యంలో కీలక ముందడుగు విజయవంతంగా పూర్తయింది. ఆర్టెమిస్ అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా 1వ తేదీన ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష....
పాక్ వేదికగా యూఎస్-ఇరాన్ చర్చలు జరుగుతున్న వేళ రెండు అమెరికన్ యుద్ధ నౌకలు హోర్ముజ్ జలసంధిని దాటినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
విదేశీ బ్యాంకుల్లోని ఇరాన్ నిధులపై ఆంక్షలను ఎత్తేసే యోచనలో అమెరికా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
యూఎస్, ఇరాన్ చర్చలు మొదలైన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ నిజాయతీని గమనిస్తుంటానని అన్నారు.
యూఎస్తో చర్చలకు ముందే ఇరాన్ కొన్ని కండీషన్స్ పెట్టినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. లెబనాన్పై దాడులు ఆగడం, ఇరాన్ ఆస్తులపై ఆంక్షల తొలగింపు జరిగితేనే చర్చలు మొదలుపెడతామని ఇరాన్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని మొదలుపెట్టిన నాటి నుంచీ అమెరికా సగటున రోజుకు ఒక ఎయిర్ క్రాఫ్ట్ను కోల్పోయినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీటిల్లో అధిక శాతం డ్రోన్స్ అని తేలింది.