పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ తరఫున పోరాటం చేయకుండా మియామీలో నివసిస్తున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కుమారుడు యైుర్...
ఇరాన్ నగరం కోమ్లో దేశ సుప్రీం నేతను ఎన్నుకునే 'కౌన్సిల్ ఆఫ్ ఎక్స్పర్స్ట్' భవనంపై ఇజ్రాయెల్ మంగళవారంనాడు గగనతల దాడులు జరిపింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ అధికారులు ధ్రువీకరించారు.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియన్ తాజాగా కీలక ప్రకటన చేసారు. యుద్ధం కొనసాగుతున్నా ఇరాన్ ప్రభుత్వ యంత్రాంగ అద్భుతంగా పనిచేస్తోందన్నారు.
ఆస్టిన్లో ఇటీవల జరిగిన కాల్పుల్లో ఇరాన్ ఉగ్ర కోణం ఉండే అవకాశం ఉందని టెక్సాస్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో భారతీయ యువతి కూడా మరణించిన విషయం తెలిసిందే.
ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్పై ఇజ్రాయెల్ దాడులను ఉధృతం చేసింది. సోమవారం రాత్రి పక్కా ఇంలెటిజెన్స్ సమాచారంతో టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న పలు కీలక ప్రాంగణాలపై దాడులు జరిపామని, అధ్యక్ష కార్యాలయం, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ భవనంపై బాంబులు జారవిడిచామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది.
ఇరాన్లో బుషెహర్ అణుకేంద్రానికి ముప్పు ఉందని రష్యా ప్రభుత్వ అణు సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
పశ్చిమాసియాలో నాలుగో రోజు కూడా దాడులు, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా మద్దతుతో ఇరాన్పై ఇజ్రాయెల్ మిసైళ్లతో విరుచుకుపడుతోంది. తాజా దాడుల్లో ఇరాన్ కొత్త రక్షణ మంత్రి సైయద్ మాజిద్ అల్-రేజా మృతి చెందినట్టు 'ది స్పెక్టేటర్ ఇండెక్స్' వెల్లడించింది.
ఇరాన్లోని నటాంజ్ అణు శుద్ధి కేంద్రంపై దాడి జరిగినట్టు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ధ్రువీకరించింది. దాడుల తర్వాత సేకరించిన హై రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించినట్టు తెలిపింది.
చర్చలకు ఇరాన్ సిద్ధంగా ఉన్నా బలవంతంగా యుద్ధాన్ని రుద్దారని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. దీని వెనుక జియోనిస్టు కుట్ర ఉందని చెప్పారు.
ఇరాన్పై అమెరికా నేతృత్వంలో జరుగుతున్న దాడులను చైనా ఖండించింది. కాల్పులను తక్షణం కట్టిపెట్టి చర్చలకు దిగాలని సూచించింది.