మరో రెండు రోజుల్లో యూఎస్, ఇరాన్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వారం కాల్పుల విరమణ గడువు ముగిసే లోపే మళ్లీ చర్చలు ప్రారంభించాలని ఇరు వర్గాలు యోచిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి
హోర్ముజ్ జలసంధిని యూఎస్ దిగ్బంధించడంపై సౌదీ అరేబియా ఆందోళనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చర్యలతో ఇరాన్ మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నట్టు సమాచారం.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్కు మరో కఠిన హెచ్చరిక జారీ చేశారు. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 7:30 గంటల నుంచి హోర్ముజ్ దిగ్బంధనం ప్రారంభమైందని తెలిపారు.
అమెరికా-ఇరాన్ యుద్ధం కీలక దశలోకి చేరిన సమయంలో అగ్రరాజ్యానికి నాటో మిత్ర దేశాలు షాక్ ఇచ్చాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన హార్ముజ్ దిగ్బంధనానికి నాటో మిత్రదేశాలు మద్దతు ఇవ్వడానికి నిరాకరించాయి.
ఎంతో శక్తివంతమైన, అధునాతనమైన అమెరికా యుద్ధ విమానాలకు పశ్చిమాసియాలో గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎంతో గొప్పవి అని అమెరికా చెప్పుకుంటున్న యుద్ధ విమానాలు కూడా కూలిపోయాయి. ఇరాన్ యుద్ధంలో అమెరికా వైమానికి దళానికి భారీ నష్టం సంభవించింది.
యూఎస్-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లోని గాంధీ ఆసుపత్రి దెబ్బతిందంటూ ఇరాన్ తాజాగా ఒక వీడియోను షేర్ చేసింది.
ఇరాన్పై పరిమిత స్థాయి దాడులను ప్రారంభించే యోచనలో యూఎస్, ఇజ్రాయెల్ ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అదుపు తప్పిపోయిన ట్రంప్ను వెంటనే అమెరికా అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని మాజీ సీఐఏ చీఫ్ జాన్ బ్రెన్నన్ అన్నారు. ట్రంప్తో ప్రజలకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.
హోర్ముజ్ను దిగ్బంధిస్తామన్న ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ మరోసారి ఘాటుగా స్పందించింది. హోర్ముజ్లో యుద్ధ నౌకలు కనిపిస్తే దాడులు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.
ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. హోర్ముజ్ జలసంధిని అడ్డుపెట్టుకుని ఇరాన్ ప్రపంచ దేశాలను ఇబ్బందిపెడుతోందని మండిపడ్డారు.