గల్ఫ్ దేశాలపై దాడుల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఆదివారంనాడు తెలిపారు. పొరుగు దేశాలు దాడులు జరిపితే తమ దేశ రక్షణ కోసం ప్రతిస్పందించాల్సి వస్తుందని వివరించారు.
ఇజ్రాయెల్, అమెరికా జరిపిన సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తర్వాత కొత్త నేతను ఎన్నుకునేందుకు అక్కడి ప్రభుత్వంలోని అగ్ర నేతలు ప్రయత్నిస్తున్నారు.
లెబనాన్ రాజదాని బీరుట్పై ఇజ్రాయెల్ ఆదివారంనాడు బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో సర్ అల్ ఘార్బియా టౌన్లోని మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో సుమారు 19 మంది మృతిచెందారు.
ఇరాన్లోని శుద్ధి చేసిన యూరేనియంను స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక దళాలను రంగంలోకి దింపడంపై అమెరికా, ఇజ్రాయెల్లు చర్చిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇరాన్ తాజాగా బహ్రెయిన్ రాజధాని మేనామలోని జుఫైర్ జిల్లాలోని అమెరికా నావికాదళానికి చెందిన 5వ ఫ్లీట్ ప్రధానకార్యాలయంపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో 21 మంది అమెరికా సైనికులు మృతి చెందినట్టు టెహ్రాన్ టైమ్స్ తెలిపింది.
ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శ అలీ లారిజానీ తాజాగా చేసిన హెచ్చరికలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. అతడు ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తప్పులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఇరాన్ జాతీయ భద్రతా మండలి సెక్రెటరీ అలీ లారిజానీ తాజాగా వార్నింగ్ ఇచ్చారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భారత్కు తాత్కాలిక మినహాయింపునిస్తూ అమెరికా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దంటూ కొన్ని నెలల పాటు భారత్తో వాణిజ్య యుద్ధానికి దిగిన అమెరికా.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ యూటర్న్ తీసుకుంది.
యూకే ప్రధాని కీర్ స్టార్మర్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైర్ అయిపోయారు. యుద్ధం ముగిశాక అమెరికా వెంట వస్తామనే వారు తమకు అవసరం లేదని సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఓడిపోయిన దేశంగా ఇరాన్ మారిందని, ఆ దేశం ఇంకెతమాత్రం మద్యప్రాచ్య ప్రాంతంపై ఆధిపత్యం చలాయించే శక్తి కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.