అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై దాడి చేయడంతో ప్రారంభమైన యుద్ధం ఆరో వారానికి చేరుకుంది. ఈ యుద్ధ ప్రభావం ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్తో పాటు గల్ఫ్ దేశాలకు, ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలకు తీవ్ర నష్టం కలిగించింది.
అమెరికాకు చెందిన అమెరికన్ ఏ-10 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేసింది. శుక్రవారం స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర అమెరికన్ ఏ-10 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేసిందని తస్నిమ్ న్యూస్ ఎజెన్సీ తెలిపింది.
శుక్రవారం ఇరాన్ ప్రయోగించిన మిసైల్ను అబుధాబీ మార్గమధ్యంలోనే అడ్డుకుంది. అయితే, కొన్ని శకలాలు తగలడంతో అబుధాబిలో 12 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారని ప్రభుత్వ మీడియా కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇరాన్ ప్రతీకార దాడులకు సిద్ధమైంది. గల్ఫ్, జోర్డాన్లలోని 8 ప్రముఖ బ్రిడ్జ్లను ఐఆర్జీసీ టార్గెట్ చేసింది. ఈ మేరకు ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ఐఆర్జీసీ దాడులు చేయడానికి నిశ్చయించుకున్న బ్రిడ్జ్ల లిస్ట్ను రిలీజ్ చేసింది.
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగా దెబ్బతిన మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి ముందుకు రావాలని ఇరాన్ ప్రజలకు ఆ దేశ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ పిలుపునిచ్చారు.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సహా ఆ దేశ ఉన్నతాధికారులు మంగళవారం 'ఇస్లామిక్ రిపబ్లిక్ డే' వేడుకల్లో భాగంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత బహిరంగంగా కనిపించారు.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న దాడులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి తీవ్ర తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. ఒకవైపు ఇరాన్ దాడులు, మరోవైపు హోర్ముజ్ జలసంధి మూసివేతతో ఆర్థిక ఇబ్బందులు.. యూఏఈని కలవరపెడుతున్నాయి.
పశ్చిమాసియాలో నెల రోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధం ముగింపు దశకు చేరుకునేలా కనిపిస్తోంది. శాంతి చర్చలకు ఇప్పటికే అమెరికా మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇరాన్ కూడా అదే తరహాలో స్పందించింది.
ఇరాన్ ప్రయోగిస్తున్న షాహిద్ డ్రోన్స్ను అడ్డుకునే ఇంటర్సెప్టర్ల కోసం గల్ఫ్ దేశాలు ఉక్రెయిన్తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇరాన్ అణు కేంద్రక నగరం ఇస్ఫహాన్పై అమెరికా భీకర దాడులు చేసింది. ఆయుధాలు ఉన్న ఓ డిపోపై బంకర్ బస్టర్లతో దాడి చేసింది. రెండు వేల పౌండ్ల బంకర్ బస్టర్లతో దాడులు చేయడంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి.