పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఒకవైపు దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు కొనసాగిస్తుండగా, మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని బరాకా అణు విద్యుత్ కేంద్రం సమీపంలో డ్రోన్ దాడి జరగింది.
ప్రధాని మోదీకి యూఏఈ పర్యటన సందర్భంగా అపూర్వ స్వాగతం లభించింది. యూఏఈ గగనతలంలోకి ప్రధాని ఎయిర్ ఇండియా వన్ విమానం ప్రవేశించగానే యూఏఈ తన ఎఫ్-16 యుద్ధ విమానాలను ఎస్కార్ట్గా పంపించింది.
యూఏఈ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ అల్ నహ్యాన్తో సమావేశమయ్యారు. యూఏఈపై దాడులను ఖండిస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు.
పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఖతార్కు సమీపంలోని ఓ బల్క్ క్యారియర్పై దాడి జరిగింది. ఖతార్ రాజధాని దోహాకు సమీపంలో ఈ ఘటన జరిగింది. పెద్ద మొత్తంలో కంటైనర్లను తీసుకొస్తున్న ఓ నౌకపై డ్రోన్ లేదా క్షిపణితో దాడి చేసినట్టు తెలుస్తోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమవుతున్నాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఫుజైరా ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడి ఆందోళన కలిగిస్తోంది. ఫుజైరాలోని చమురు నిల్వ కేంద్రం, ఇండస్ట్రియల్ జోన్పై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది.
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేతికి కీలక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చేరింది. ఇజ్రాయెల్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 'ఐరన్ డోమ్' యూఏఈకి అందినట్టు వార్తలు వస్తున్నాయి.
పర్షియన్ గల్ఫ్లో కీలక సముద్ర మార్గమైన హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ నౌకాదళానికి చెందిన సైనికులు భారతదేశానికి వెళ్తున్న ఓ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకున్న ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ మళ్లీ హోర్ముజ్ జలసంధిని మూసేసింది. తాజాగా హోర్ముజ్లో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై కాల్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. హోర్ముజ్ జలసంధి తెరుచుకుందనే ఆనందం 24 గంటలు కూడా నిలవలేదు. మళ్లీ హోర్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది.
ఇరాన్ ఓడరేవులపై అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగిస్తే గల్ఫ్ ప్రాంతంలో పూర్తిగా వాణిజ్యాన్ని స్థంభింపచేస్తామని ఇరాన్ హెచ్చరించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం, ఒమన్ సముద్రం, ఎర్ర సముద్రం అంతటా ఎగుమతులు, దిగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని ఇరాన్ పేర్కొంది.