అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాలుస్తూనే ఉన్నాయి. కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేపట్టింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ మొదటికి వచ్చాయి. శాంతి చర్చలు కొనసాగుతున్న దశలో ఇరు దేశాలు తాజాగా పరస్పర దాడులకు దిగాయి. ఇరాన్కు చెందిన రాడార్ వ్యవస్థలు, డ్రోన్ కమాండ్ కంట్రోల్ కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులు నిర్వహించింది.
ఇరాన్ యుద్ధంలో తాము ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడానికి ఇష్టపడటం లేదని చెబుతున్న బ్రిటన్, హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా మార్చేందుకు మాత్రం సిద్ధమవుతోంది. హోర్ముజ్ జలసంధిలోని ఇరాన్ అమర్చిన మందుపాతరలను గుర్తించి, తొలగించడంలో సహాయపడటానికి ముందుకొచ్చింది.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ఇరాన్లోని కీలక సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా తాజాగా వైమానిక దాడులు నిర్వహించింది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో పరిస్థితులను మరింత ఆందోళనకరంగా మార్చాయి.
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ భూగర్భ స్థావరంలో తలదాచుకుంటున్నట్టు అమెరికా నిఘావర్గాలు సహా పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి. దీని ఫలితంగానే సమాచార మార్పిడికి అధిక సమయం పడుతోందని పేర్కొన్నాయి.
యూఏఈలోని అణువిద్యుత్ కేంద్రంపై దాడి జరగడాన్ని భారత్ తాజాగా ఖండించింది. పరిస్థితి ప్రమాదకరమైన మలుపు తిరుగుతోందని హెచ్చరించింది.
పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఒకవైపు దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు కొనసాగిస్తుండగా, మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని బరాకా అణు విద్యుత్ కేంద్రం సమీపంలో డ్రోన్ దాడి జరగింది.
ప్రధాని మోదీకి యూఏఈ పర్యటన సందర్భంగా అపూర్వ స్వాగతం లభించింది. యూఏఈ గగనతలంలోకి ప్రధాని ఎయిర్ ఇండియా వన్ విమానం ప్రవేశించగానే యూఏఈ తన ఎఫ్-16 యుద్ధ విమానాలను ఎస్కార్ట్గా పంపించింది.
యూఏఈ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ అల్ నహ్యాన్తో సమావేశమయ్యారు. యూఏఈపై దాడులను ఖండిస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు.
పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఖతార్కు సమీపంలోని ఓ బల్క్ క్యారియర్పై దాడి జరిగింది. ఖతార్ రాజధాని దోహాకు సమీపంలో ఈ ఘటన జరిగింది. పెద్ద మొత్తంలో కంటైనర్లను తీసుకొస్తున్న ఓ నౌకపై డ్రోన్ లేదా క్షిపణితో దాడి చేసినట్టు తెలుస్తోంది.