అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ గత శనివారంనాడు తొలిసారి టెహ్రాన్పై జరిపిన దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సూరే ఖోజాస్తే సోమవారంనాడు మరణించినట్టు ఆదేశ అధికారిక వార్తా సంస్థ తెలిపింది.
అమెరికా, ఇజ్రాయెల్ తాజాగా నాటాంజ్లోని ఇరాన్ ప్రధాన అణుక్షేత్రంపై దాడి చేసినట్టు ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీలో ఇరాన్ రాయబారి రెజా నజాఫి తెలిపారు. అయితే దీనిని ఐక్యరాజ్యసమితి అణు నిఘా సంస్థ ఖండించింది.
ఇరాన్తో యుద్ధం మరో నాలుగు, ఐదు వారాలు జరగొచ్చని, ఆ యుద్ధం ముగిసేలోపు మరింత మంది ఎక్కువ అమెరికా సైనికులు మృతి చెందే అవకాశం ఉందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా మద్దతుతో ఇరాన్పై ఇజ్రాయెల్ శనివారంనాడు దాడి జరపడం, ఇందుకు ప్రతిగా ఇరాన్ వరుసగా రెండోరోజు కూడా అమెరికా మిత్రదేశాలపై దాడులు జరుపుతుండటంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పొరుగుదేశాలపై దాడులు ఎందుకు చేస్తున్నారని ఇరాన్ను నిలదీసింది.