రెయిన్ అలర్ట్.. ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:11 PM
రాబోయే మూడు గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు ప్రకటించారు.
అమరావతి, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): రాబోయే మూడు గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు ప్రకటించారు.
రెడ్ అలర్ట్..
శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.
ఆరెంజ్ అలర్ట్
అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఎల్లో అలర్ట్
కాకినాడ, తూర్పుగోదావరి, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, భారీ హోర్డింగ్స్ దగ్గర నిలబడరాదని సూచించారు. అవసరం లేకుండా ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ అభివృద్ధిని గొడ్డలి పార్టీ అడ్డుకుంటోంది.. కొల్లు రవీంద్ర ధ్వజం
ఎంఎస్ఎంఈ పార్కులతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News