శ్రీశైలంలో భారీగా పట్టుబడిన నోట్ల కట్టలు

ABN, Publish Date - Jan 28 , 2026 | 08:09 AM

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపింది. శ్రీశైలం టోల్‌గేట్ వద్ద చేపట్టిన తనిఖీల్లో రూ.30 లక్షల నగదు పట్టుబడింది.

నంద్యాల , జనవరి 28 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపింది. శ్రీశైలం టోల్‌గేట్ వద్ద చేపట్టిన వాహన తనిఖీల్లో రూ.30 లక్షల నగదు పట్టుబడింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో శ్రీశైలం క్షేత్రంలోకి ప్రవేశించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాల్లో మహారాష్ట్రకు చెందిన కియా కారులో బ్యాగు బయటపడింది.


వాహనంలోని వ్యక్తులు పోలీసులతో మాట్లాడుతూ.. తమది బంగారం వ్యాపారమని, శ్రీశైలం దర్శనార్థం వచ్చామని తెలిపారు. అయితే పట్టుబడిన నగదుకు సంబంధించి సరైన డాక్యుమెంట్స్ చూపించకపోవడంతో పాటు వారు పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు రూ.30లక్షలతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జగన్ భూ దోపిడీకి పాల్పడ్డారు: మంత్రి డీబీవీ స్వామి

బడ్జెట్ సమావేశాలపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Read Latest AP News And Telugu News

Updated at - Jan 28 , 2026 | 08:20 AM