రోడ్ల విస్తరణకు ఇరిగేషన్ అధికారులు ఎందుకు అడ్డం పడుతున్నారు: ఎంపీ రఘునందన్ రావు
ABN , Publish Date - Sep 19 , 2026 | 11:16 AM
అమీన్పూర్లో ఇరిగేషన్ అధికారులపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బఫర్ జోన్, FTL పేరుతో రోడ్ల విస్తరణకు ఇరిగేషన్ అధికారులు ఎందుకు అడ్డం పడుతున్నారని ప్రశ్నించారు.
సంగారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 19 (ఆంధ్రజ్యోతి): అమీన్పూర్లో ఇరిగేషన్ అధికారులపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు (BJP Medak MP Raghunandan Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బఫర్ జోన్, FTL పేరుతో రోడ్ల విస్తరణకు ఇరిగేషన్ అధికారులు ఎందుకు అడ్డం పడుతున్నారని ప్రశ్నించారు. చెరువుల్లో పెద్ద పెద్ద భవనాలు కడుతుంటే ఇరిగేషన్ అధికారులకు ఎందుకు కనిపించట్లేదని నిలదీశారు.
కానీ.. అమీన్పూర్లో బంధంకొమ్ము చెరువు వద్ద 150 ఫీట్ల రోడ్డుకు మాత్రం ఎందుకు అనుమతి ఇవ్వరని ఎంపీ ప్రశ్నించారు. వారం రోజుల్లో బంధంకొమ్ము చెరువు వద్ద 150 ఫీట్ల రోడ్డుకి అనుమతి ఇవ్వకపోతే ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్: మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన సీఎం
కేసీఆర్ ఫాంహౌస్ భూములపై మా దగ్గర ఆధారాలు.. సమాధానం చెప్పాల్సిందే: పొంగులేటి
ఫ్యూచర్ సిటీలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్రెడ్డి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News