Share News

జీహెచ్‌ఎంసీ ఆఫీస్‏లో పాముల సయ్యాట

ABN , Publish Date - Jun 03 , 2026 | 09:36 AM

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం రెండు పాముల సయ్యాటతో ఉద్యోగులు ఆందోళన చెందారు.

జీహెచ్‌ఎంసీ ఆఫీస్‏లో పాముల సయ్యాట
Two Snakes

  • ఉద్యోగుల ఆందోళన

హైదరాబాద్‌ సిటీ: జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం రెండు పాముల సయ్యాటతో ఉద్యోగులు ఆందోళన చెందారు. లోయర్‌ ట్యాంక్‌బండ్‌ బల్దియా ఆఫీస్‏లోని పార్కులో రెండు పాములు ఒకదానితో ఒకటి పెనవేసుకుంటూ దాదాపు రెండు నిమిషాల పాటు పోటీపడ్డాయి. కొందరు ఉద్యోగులు, సందర్శకులు వీటిని ఆసక్తిగా తిలకించగా మరికొందరు ఆందోళన చెందుతూ ఆఫీస్‏లోకి పాములు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. పార్కు పక్కనే నాలా ఉండడంతో అందులో నుంచి పాములు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు.


city3.jpgఈ వార్తలు కూడా చదవండి:

బీజేపీకి అన్నామలై రాజీనామా!

290 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 03 , 2026 | 09:36 AM