సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
ABN , Publish Date - Aug 26 , 2026 | 06:15 AM
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ మండలం దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు.
సూర్యాపేట జిల్లా, ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ మండలం దొరకుంట శివారులో ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా.. మరో11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ఈ ప్రమాదంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం అందజేశారు. పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు ప్రయాణిస్తున్న బస్సు దొరకుంట శివారులో ముందు వెళ్తున్న కంటైనర్ డీసీఎంను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్ – విజయవాడ మార్గంలో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమా, అతివేగమా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కంటైనర్ డీసీఎంను బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొనడంతోనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మృతుల గుర్తింపు, క్షతగాత్రుల సంఖ్యపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
పైలట్ల డోప్ టెస్టులపై కేంద్రం ఫోకస్.. ఏడాదికి ఒకసారి పరీక్షకు యోచన: రామ్మోహన్
బీసీలను జగన్ రెడ్డి మోసం చేస్తున్నారు.. యనమల ధ్వజం
వన మహోత్సవం లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి: మంత్రి సీతక్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News