Share News

హైదరాబాద్ పాతబస్తీలో ఇంటర్ విద్యార్థి హత్య

ABN , Publish Date - Jul 19 , 2026 | 07:51 AM

హైదరాబాద్ పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీక్రీ ప్రాంతంలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి మహ్మద్ ఫైజ్ అలియాస్ అజాన్‌ను గుర్తుతెలియని వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు.

హైదరాబాద్ పాతబస్తీలో ఇంటర్ విద్యార్థి హత్య
Hyderabad Old City Student Case

హైదరాబాద్, జులై 19 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీక్రీ ప్రాంతంలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి మహ్మద్ ఫైజ్ అలియాస్ అజాన్‌ను గుర్తుతెలియని వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే కాలపత్తర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్‌తో కలిసి ఆధారాలు సేకరించారు.


ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. హత్య అనంతరం నిందితుడు పరారైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణ ఉద్యమానికి అందెశ్రీ ప్రాణం పోశారు: సీఎం రేవంత్‌రెడ్డి

గంజాయి పండిస్తున్న సాధువు అరెస్ట్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 19 , 2026 | 07:56 AM