నేత్రపర్వంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాలను సమర్పించిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Sep 16 , 2026 | 07:03 AM
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు.
1/16
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
2/16
మంగళవారం సాయంత్రం 6.21- 6.35 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
3/16
వేద ఘోష మధ్య మంగళవాయిద్యాలు మోగుతుండగా బంగారు ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని ఎగురవేసిన అర్చక బృందం.. సకల దేవతామూర్తులు, అష్టదిక్పాలకులకు ఆహ్వానం పలికింది.
4/16
సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు మంగళవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి పెద్దశేష వాహనంలో నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని కటాక్షించారు.
5/16
సీఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేశ్ దంపతులతో కలిసి మంగళవారం సాయంత్రం తిరుమలలోని గాయత్రి విశ్రాంతి భవనానికి చేరుకుని కొంతసమయం విశ్రాంతి తీసుకున్నారు.
6/16
అనంతరం సంప్రదాయ వస్త్రధారణతో తొలుత బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు.
7/16
అక్కడ అర్చకులు చంద్రబాబు తలకు పరివట్టం చుట్టి శేషవస్త్రాన్ని మెడలో ధరింపజేశారు.
8/16
ఆ తర్వాత నూతన పట్టువస్త్రాలను సీఎం చంద్రబాబు తలపై పెట్టుకుని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని వస్త్రసమర్పణ చేశారు.
9/16
తిరువీధుల్లో ఊరేగుతున్న శ్రీవారు
10/16
అక్కడినుంచి వాహన మండపానికి చేరుకుని పెద్దశేష వాహన సేవలో పాల్గొని ఉత్సవమూర్తులను సీఎం కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు.
11/16
అనంతరం టీటీడీ ముద్రించిన 2027 నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను సీఎం ఆవిష్కరించారు.
12/16
దేశంలో, ప్రపంచంలో ఉండే హిందువులంతా ఒక్కసారైనా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాలని, ఆయన సాన్నిధ్యంలో కొంత సమయం గడపాలని ఆశిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
13/16
భక్తులందరికీ ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించే విధంగా పాలకమండలి, టీటీడీ సిబ్బంది పనిచేయాలని సీఎం చంద్రబాబు కోరారు.
14/16
ముఖ్యమంత్రిగా 15వ సారి వచ్చి ప్రభుత్వం తరఫున లాంఛనాలు సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబాబు చెప్పారు.
15/16
రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడాలని, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముందుండి నడిపించేలా ఆశీర్వదించాలని శ్రీవారిని కోరుకున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు.
16/16
మంత్రి నారా లోకేశ్కు బొట్టు పెడుతున్న బ్రాహ్మణులు.
Updated at - Sep 16 , 2026 | 07:27 AM