ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పిన మెటా సీఈఓ జుకర్బర్గ్
ABN , Publish Date - Aug 05 , 2026 | 04:54 PM
ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియో తొలగింపుపై మెటా దిగొచ్చింది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్.. ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియో తొలగింపుపై మెటా దిగొచ్చింది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్.. ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పారు. సీఎస్ఏఎమ్, డీప్ఫేక్ కంటెంట్ వ్యాప్తిపై విచారం వ్యక్తం చేసిన మెటా.. కొన్ని రకాల కంటెంట్ను బూస్ట్ చేయడానికి భారీగా డబ్బులు తీసుకున్నట్టు అంగీకరించింది. అంతే కాకుండా తమ ఫ్లాట్ఫామ్ నిర్వహణలో జరిగిన పొరపాట్లను కూడా అంగీకరించింది మెటా.
కాగా.. ప్రధాని మోదీకి సంబంధించిన జులై 23 నాటి వీడియోను తొలగించడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని మెటాను పార్లమెంటరీ కమిటీ బుధవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవడం సహా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మూడు రోజుల అల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు దిగొచ్చిన మెటా.. మోదీని క్షమాపణలు చెప్పింది.
ఇవీ చదవండి:
'నేను ఎంకే స్టాలిన్ తనయుడిని'.. ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
తమిళనాడు బడ్జెట్: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. జెన్ జీకి రూ.2 వేల కోట్లు