Home » Facebook
వాట్సాప్ మెసేజింగ్ యాప్ అత్యంత సురక్షితమైనదని భావిస్తుంటాం. ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ టెక్నాలజీతో నడిచే వాట్సాప్ మెసేజ్లను మూడో వ్యక్తి చదవడం అసాధ్యమని భావిస్తుంటాం. అయితే వాట్సాప్ ఛాట్ను దాని మాతృ సంస్థ 'మెటా' చదవగలదని అంతర్జాతీయ వాట్సప్ వినియోగదారుల బృందం వాదిస్తోంది.
సోషల్ మీడియా ద్వారా ఆఫర్లంటూ ప్రకటనలు గుప్పిస్తూ.. ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి పక్రటనలు ఎక్కువయ్యాయి. అయితే.. ఈ మోసపూరిత ప్రకటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తోంది.
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ అయిన మెటా.. తన రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో పనిచేస్తున్న 1500 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఈ విభాగం కొన్నేళ్లుగా బిలియన్ల డాలర్ల మేర నష్టాలు చవిచూస్తోంది. దీంతో ఏఐలో వేగంగా రాబడి వచ్చే అవకాశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టపోతున్నాం. ఈ సందర్భంగా ఈ ఏడాది ఇన్స్టా, ఫేస్బుక్లలో బాగా వైరల్ అయిన వీడియోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా అందుబాటులో ఉండకూడదని ఆస్ట్రేలియా కొన్ని నెలల క్రితం నిర్ణయం తీసుకుని చట్టం చేసింది. ఈ చట్టం డిసెంబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నట్టు తెలిపింది. దీంతో మెటా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
ఫేస్బుక్లో స్నేహం నటించి పెట్టుబడి పేరుతో రూ.10.21 లక్షలకు టోకరా వేసిందో మహిళ. సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం.. లంగర్హౌజ్కు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి ఫేస్బుక్లో ఓ మహిళ పరిచయమైంది. తన పేరు సాయిప్రీతి అని, తనది వైజాగ్ అని ఇటీవలే యూకే నుంచి వచ్చానని నమ్మబలికింది.
అసలే అమ్మాయిలు, అందరికీ తెలిసిన అందాల భామలు వాళ్లంతా.. ఈ వయసులోనే ఇంత అందగత్తెలై వెండితెరల్ని ఏలుతుంటే, ఇక వాళ్లు చిన్నప్పుడు ఇంకెంత ముద్దొచ్చే వాళ్లో..
ఫేస్బుక్ యూజర్లకు గుడ్ న్యూస్. యూజర్లకు మరింత వినోదాన్ని అందించేందుకు సరికొత్త మ్యూజిక్ ఫీచర్ను ప్రవేశపెట్టారు. మీరు ఈ ఫీచర్ను ఉపయోగించి మీ ఫేస్బుక్ ప్రొఫైల్ను మరింత సరికొత్తగా మార్చుకోవచ్చు. అది ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఇటీవల జో రోగన్ పాడ్కాస్ట్లో పాల్గొన్న జుకర్ బర్గ్ కీలక వ్యాఖ్యాల చేశారు. ఇటీవల పాకిస్తాన్లో తనపై నమోదైన దావా గురించి ఈ సందర్భంగా బయటపెట్టారు. వివిధ దేశాల్లో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమెరికా సంస్థలకు అమెరికా ప్రభుత్వం సహాయసహకారాలు అందించాలని ఈ సందర్భంగా జుకర్ బర్గ్ విజ్ఞప్తి చేశారు.
ఫేస్బుక్(Hyderabad:) ద్వారా ఓ ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. ఇంటి యజమాని పండుగకు ఊరు వెళ్లారని నిర్ధారించుకున్నాడు. పరిచయం ఉన్న వ్యక్తికి మద్యం తాగించి యజమాని ఇంట్లో సుమారు రూ. 50 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేశాడు.