-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 27th June 2026 VK
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jun 27 , 2026 | 07:03 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jun 27, 2026 08:29 IST
అమెరికా దాడులపై మండిపడ్డ ఇరాన్
చర్చల మధ్యలో దాడులు చేయడం శాంతి ఒప్పందాన్ని అమెరికా కాలరాయడమే: ఇరాన్
ఒప్పంద ఉల్లంఘన అమెరికాకే నష్టం: ఇరాన్
అమెరికా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు: ఇరాన్
-
Jun 27, 2026 08:20 IST
నేడు జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ భేటీ
మంగళగిరిలో ఉదయం 10గంటలకు సమావేశం
పరిశీలకులు, కమిటీ సభ్యులతో భేటీకానున్న పవన్ కల్యాణ్
కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేయనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Jun 27, 2026 08:19 IST
భద్రాద్రి: నేడు కొత్తగూడెంలో మంత్రి తుమ్మల పర్యటన
గోదావరి వరదల సన్నద్ధతపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష
-
Jun 27, 2026 08:19 IST
భద్రాచలం రామాలయ విస్తరణ పనులకు నేడు శ్రీకారం
ఆలయ అభివృద్ధి పనులకు రూ.586 కోట్లతో మాస్టర్ ప్లాన్
తొలి విడతలో రూ.200 కోట్ల నిధులతో ఆలయ విస్తరణ
వచ్చే ఏడాది శ్రీరామ నవమి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యం
-
Jun 27, 2026 08:18 IST
కడప జిల్లా చెన్నూరులో రోడ్డు ప్రమాదం
ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు.. ముగ్గురి మృతి
పలువురికి స్వల్ప గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jun 27, 2026 07:23 IST
నేడు నెల్లూరు బారాషహీద్ దర్గాలో గంధమహోత్సవం
బారాషహీద్ దర్గా వద్ద అట్టహాసంగా కొనసాగుతున్న రొట్టెల పండుగ.
ఈ రోజు రాత్రికి గంధమహోత్సవం.
దేశంలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివస్తున్న భక్తులు.
జనసంద్రంగా మారిన బారాషహీద్ దర్గా, స్వర్ణాల చెరువు ప్రాంతం.
నగరంలోని రోడ్లన్నీ భక్తులు, వాహానాలతో కిటకిట.
ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనున్న రొట్టెల పండుగ.
రొట్టెల పండుగను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వం.
ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి.
-
Jun 27, 2026 07:12 IST
వెనెజువెలాలో మరో భూకంపం
రిక్టర్ స్కేల్పై 4.9గా తీవ్రత నమోదు
రెండురోజుల క్రితమే 2 వరుస భూకంపాలతో వెనెజువెలాలో మారణహోమం
ఇప్పటివరకు 920 మంది మృతి, 3 వేల మందికి గాయాలు
భవన శిథిలాల కింది చిక్కుకున్న వేలాది మంది కోసం రెస్క్యూ ఆపరేషన్
-
Jun 27, 2026 07:10 IST
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
ఉదయం 10:45కు గంటావానిపల్లి చేరుకోనున్న సీఎం చంద్రబాబు
గంటావానిపల్లిలో వెలిగొండ ఫీడర్ కెనాల్ పనుల పరిశీలన
వెలిగొండ లబ్ధిదారులు, నిర్వాసితులతో మాట్లాడనున్న ముఖ్యమంత్రి
నిర్వాసితులకు రూ.300 కోట్లు పరిహారం పంపిణీ చేయనున్న సీఎం
మధ్యాహ్నం గిద్దలూరు మండలం కిష్టంశెట్టిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన
కిష్టంశెట్టిపల్లి హాస్పిటల్లో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్కు ప్రారంభోత్సవం
లబ్ధిదారులతో ముఖాముఖిలో మాట్లాడనున్న సీఎం చంద్రబాబు
ప్రజావేదిక సభలో పాల్గొని, ఆ తర్కాత కార్యకర్తల భేటీలో పాల్గొననున్న సీఎం
-
Jun 27, 2026 07:05 IST
ఢిల్లీ: జులై 1 నుంచి 3వ తేదీ వరకు భారత్లో జపాన్ ప్రధాని పర్యటన
ఇండియా-జపాన్ 16వ సమ్మిట్లో పాల్గొననున్న జపాన్ ప్రధాని
టకాయిచీ, ఇరుదేశాల మధ్య సహకారం మరింత పెంచుకునే అవకాశం
-
Jun 26, 2026 07:08 IST
నేటి నుంచి సీషెల్స్లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన
సీషెల్స్ దేశ స్వర్ణోత్సవాలకు హాజరుకానున్న మోదీ