శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
ABN , Publish Date - Apr 29 , 2026 | 06:40 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలో తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోగా క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచి ఉన్నారు.

ఆదివారం హుండీ ఆదాయం: రూ.4.44 కోట్లు
సోమవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 74,286
తలనీలాలు సమర్పించినవారు: 33,186
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..
Read Latest Telangana News and National News