Share News

మే 9న పాస్‌పోర్టు మేళా

ABN , Publish Date - Apr 29 , 2026 | 06:23 AM

తెలంగాణలో పెరుగుతున్న పాస్‌పోర్ట్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మే 9న ‘పాస్‌పోర్టు మేళా’ నిర్వహించాలని హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం (ఆర్పీవో) నిర్ణయించింది.

మే 9న పాస్‌పోర్టు మేళా

  • ఐదు పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో 4వేల సాధారణ స్లాట్ల విడుదల

  • ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారిణి స్నేహజ వెల్లడి

హైదరాబాద్‌/సికింద్రాబాద్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పెరుగుతున్న పాస్‌పోర్ట్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మే 9న ‘పాస్‌పోర్టు మేళా’ నిర్వహించాలని హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం (ఆర్పీవో) నిర్ణయించింది. ఈ మేళాలో భాగంగా ఐదు పాస్‌పోర్ట్‌ ేసవా కేంద్రాల్లో కలిపి 4వేల సాధారణ స్లాట్లు విడుదల చేయనున్నారు. అదే సమయంలో ేసవల సామర్థ్యాన్ని పెంచే దిశగా కరీంనగర్‌ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రంలో రోజువారీ స్లాట్ల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతున్నారు. మే 4 నుంచి రోజుకు 220 స్లాట్ల నుంచి 400 వరకు పెంచనున్నారు. ఇందులో సాధారణ, తత్కాల్‌, పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ ేసవలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం సాధారణ స్లాట్‌ కోసం 8 నుంచి 10 పని రోజుల సమయం పడుతుండగా, ఈ ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా వేచి చూేస సమయం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారిణి స్నేహజ జొన్నలగడ్డ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 5 పీఎస్‌కేలు, 14 పోస్టాఫీస్‌ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల ద్వారా రోజుకు సగటున 4,500 దరఖాస్తులను ప్రాసెస్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పాస్‌పోర్టు కార్యాలయం వరకు రాకుండా సమాచారం తెలుసుకునేందుకు 040-27715333, 040-27715115, 040-27806657 ఫోన్‌ నంబర్లు అందుబాటులో ఉంటాయన్నారు.

Updated Date - Apr 29 , 2026 | 06:24 AM