తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
ABN , Publish Date - May 02 , 2026 | 06:28 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోగా, క్యూలైన్ కృష్ణతేజ గెస్ట్ మీదుగా బాటగంగమ్మ ఆలయ సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
బుధవారం హుండీ ఆదాయం: రూ.4.06 కోట్లు
గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 59,186
తలనీలాలు సమర్పించిన వారు: 27,244
ఈ వార్తలు కూడా చదవండి:
జలశక్తి శాఖ కార్యదర్శితో ఏపీ అధికారుల భేటీ.. పోలవరంపై కేంద్రం కీలక నిర్ణయం
Read Latest Telangana News and National News