Share News

ఈసారి రోబో గణేశా!

ABN , Publish Date - Aug 21 , 2026 | 09:47 AM

హైదరాబాద్‏లోని మల్లిఖార్జున నగర్‌ యూత్‌ అసోసియేషన్‌ స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడు వికసిత భారత్‌ 2047 థీమ్‌లో భాగంగా రోబో ఆకారంలో గణపతిని ఏర్పాటు చేయనున్నట్లు అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు.

ఈసారి రోబో గణేశా!
Robot Ganesh Hyderabad

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని మల్లిఖార్జున నగర్‌ యూత్‌ అసోసియేషన్‌ స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడు వికసిత భారత్‌ 2047 థీమ్‌లో భాగంగా రోబో ఆకారంలో గణపతిని ఏర్పాటు చేయనున్నట్లు అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. గురువారం లలితబాగ్‌ విగ్నేశ్వర సాయిధామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆర్థిక వృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు, పర్యావరణ సుస్థిరతపై ప్రధాని మోదీ విజన్‌ను భక్తులకు తెలియజేయడానికి రోబో గణేష్‌ ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.


ఇప్పటి వరకు అయోధ్య, చంద్రయాన్‌, ఆపరేషన్‌ సిందూర్‌ థీమ్‌లలో గణపతి ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో చైర్మన్‌ చంద్రశేఖర్‌, వైస్‌ చైర్మన్‌ సుశీల్‌ కుమార్‌, కోశాధికారి గుండు శ్రీకాంత్‌, అధ్యక్షుడు వెంకటేష్‌, ప్రతినిధులు దయానంద్‌, సాయి చరణ్‌, అఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

నీటి ప్రాజెక్టులకు నిధులివ్వండి

క్యాన్సర్‌ కేర్‌, ఆరోగ్యశ్రీ భేష్‌!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 21 , 2026 | 09:47 AM