రాజమహేంద్రవరం గోదావరిలో ఏఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ముగ్గురి గల్లంతు
ABN , Publish Date - Aug 17 , 2026 | 06:53 AM
రాజమహేంద్రవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు కం రైలు వంతెనపై నుంచి ఓ కుటుంబం గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు తన కారును వంతెనపై వదిలి గోదావరిలోకి దూకారు.
రాజమహేంద్రవరం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు కం రైలు వంతెనపై నుంచి ఓ కుటుంబం గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు తన కారును వంతెనపై వదిలి గోదావరిలోకి దూకారు. ఈ ఘటనలో నూకరాజు మనవడు గోదావరిలో ఈదుకుంటూ సురక్షితంగా బయటపడగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం పోలీసులు, సహాయక బృందాలు గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టాయి.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే కుటుంబం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల నేపథ్యం, ఆర్థిక లేదా వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
వార్తలు కూడా చదవండి...
ఏనుగుల సంచారం.. ప్రజలను అప్రమత్తం చేయండి: పవన్ కల్యాణ్
నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక.. హాజరైన చంద్రబాబు, రేవంత్రెడ్డి
ప్రభుత్వ హాస్టళ్ల డెవలప్మెంట్కు దాతలు ముందుకు రావాలి: పెమ్మసాని చంద్రశేఖర్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News