Home » Godavari
గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వ్యాఖ్యానించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.
గోదావరి వరదల వల్ల ప్రజానష్టం, పంట నష్టం లేకుండా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతం భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో వరదల పట్ల జిల్లా యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామని తెలిపారు.
నిర్మల్ జిల్లా బాసరలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు గోదావరి నదిలో గల్లంతైన సంగతి తెలిసిందే. తాజాగా.. వారి మృతదేహాలను వెలికితీశారు.
గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘంతో కీలక సమావేశం నిర్వహించారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈరోజు(మంగళవారం) ఉదయం రాజమండ్రి రూరల్ మండలం వెంకట్ నగరం గ్రామంలో ఆంధ్రా పేపర్ మిల్లు వ్యర్థ జలాలు కలుస్తున్న లంకలను పరిశీలించారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహిస్తున్నట్లు ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. 2027లో వచ్చే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారని తెలిపారు.
గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అన్ని శాఖల అధికారులకు ఆదేశించారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. గోదావరి పుష్కర ఏర్పాట్లపై ఇప్పటికే మూడు సమీక్ష సమావేశాలు జరిగాయని తెలిపారు.
గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న వేళ తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పర్యటించారు. ఈ సందర్భంగా పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు.
గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారిగా అత్యున్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జూన్ 26 నుంచి జులై 7 వరకు జరగనున్న పుష్కరాలకు సంబంధించి ఘాట్ల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు, పోలవరం పనుల పూర్తి వంటి అంశాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.