Home » Godavari
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహిస్తున్నట్లు ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. 2027లో వచ్చే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారని తెలిపారు.
గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అన్ని శాఖల అధికారులకు ఆదేశించారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. గోదావరి పుష్కర ఏర్పాట్లపై ఇప్పటికే మూడు సమీక్ష సమావేశాలు జరిగాయని తెలిపారు.
గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న వేళ తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పర్యటించారు. ఈ సందర్భంగా పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు.
గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారిగా అత్యున్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జూన్ 26 నుంచి జులై 7 వరకు జరగనున్న పుష్కరాలకు సంబంధించి ఘాట్ల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు, పోలవరం పనుల పూర్తి వంటి అంశాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
కాట్రేనికోన మండలం బలుసుతిప్ప నుంచి కె.గంగవరం మండలం కోటిపల్లి వరకు సుమారు 25 కిలోమీటర్లు మేర పడవల పోటీలు జరిగాయి. పొటీలలో సుమారు 90 పడవలతో మత్స్యకారులు బృందాలుగా పాల్గొన్నారు.
గోదావరి పుష్కరాలపై అధికారులతో రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చర్చించారు. ఈ నేపథ్యంలో శాఖాపరమైన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కరాలపై వెంటనే అంచనాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు.
అల్లూరి జిల్లా విలీన మండలాల్లో రహదారులపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో చింతూరు, వీఆర్ పురం మండలాల పరిధిలో 40 లోతట్టు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలకు నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి.
ఎగువన కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో గోదారి నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది. రెండవ ఆర్చి గేటు నుంచి ఆలయానికి వెళ్లే రహదారిపై వరద వచ్చి చేరింది.
గోదారమ్మ మాత్రం శాంతించని పరిస్థితి. గంట గంటకు వరద నీరు పెరుగుతోంది. దీంతో వరదల భయంతో బాసర సరస్వతీ దేవి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల రద్దీ గతేడాది కంటే 60 శాతం తగ్గింది.
కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం నిలకడగా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని పేర్కొన్నారు.