Home » Rajamahendravaram
రాజమహేంద్రవరం అర్బన్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వాసుపత్రుల్లో కాలం చెల్లిన మందులను ఇస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు చేపట్టిన దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి వచ్చిన మందులను ఆన్లైన్ చేయకుండా ఆఫ్లైన్లో
మొంథా తుపాన్ వల్ల నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందజేస్తామని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు భరోసా కల్పించారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వెంటనే ఆదేశాలు ఇచ్చామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులని పట్టించుకోలేదని ఆరోపించారు మంత్రి అచ్చెన్నాయుడు.
మనవరాలి వయస్సు ఉండే బాలికలపై కొందరు వృద్దులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. తునిలో జరిగిన ఘటనే అందుకు ఉదాహరణ. తునిలో 8వ తరగతి చదువుతున్న గురుకుల పాఠశాల విద్యార్థినిపై ఓ వృద్ధుడు అత్యాచారం చేశాడు. ఆ ఘటన మరవక ముందే తాజాగా రాజమహేంద్రవరంలో మరో దారుణం చోటుచేసుకుంది.
అన్నదాత పంట పండింది.. ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి ఎక్కువ ధాన్యం సేకరించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఏటా సాధారణంగా 2.5 మెట్రిక్ టన్నుల నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల వరకూ సేకరించేవారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జీఎస్టీ గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. జీఎస్టీ 2.0ని కాంగ్రెస్ రాష్ట్రాలు కూడా అంగీకరించిన విషయం రాహుల్ గాంధీకి తెలియదా? అని పీవీఎన్ మాధవ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
పోలీస్ కస్టడీ నుంచి మోస్ట్వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పరారీ అయ్యాడు. విజయవాడ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా దుద్దుకూరు దగ్గర బత్తుల ప్రభాకర్ పరారయ్యాడు.
కుంభమేళా తరహాలోనే రాజమండ్రి పుష్కరాలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. ఈ పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం అందిస్తోందని పీవీఎన్ మాధవ్ వెల్లడించారు.
రాజమండ్రి సెంట్రల్ జైలుపై డ్రోన్ కలకలం సృష్టించింది. సెంట్రల్ జైలు సమీపంలోని ఒక అపార్ట్మెంట్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి డ్రోన్ ఎగరవేశారు. సెంట్రల్ జైలు ఆవరణలోకి డ్రోన్ రావడంతో పోలీసులకు జైలు సూపరిటెండెంట్ రాహుల్ ఫిర్యాదు చేశారు.
వైసీపీ ఎంపీ మిథున్రెడ్డికి జైల్లో వసతులు కల్పించాలని పిటిషన్పై ఏసీబీ కోర్టులో జులై21న విచారణ జరిగింది. నోటీసు తీసుకోవటం లేదని న్యాయమూర్తి దృష్టికి న్యాయవాదులు తీసుకువచ్చారు. మిథున్రెడ్డిని జైల్లో నేల మీద పడుకోబెట్టారని మిథున్రెడ్డి లాయర్లు చెబుతున్నారు. మంచం ఇచ్చామని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట వద్ద రోడ్డు డైవర్షన్లో నిలిపిన పాల వ్యాన్ను ఢీకొన్న కారు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన వారు కాకినాడ నుండి తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగింది.