మచిలీపట్నం ఆస్పత్రిలో మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మిక తనిఖీలు
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:00 PM
మచిలీపట్నం సర్వజన ప్రభుత్వాస్పత్రిలో ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఈరోజు(మంగళవారం) బైకుపై వచ్చి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పార్కింగ్ చేయకుండా అడ్డదిడ్డంగా ఉన్న వాహనాలను చూసి సెక్యూరిటీ విభాగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణాజిల్లా, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): మచిలీపట్నం సర్వజన ప్రభుత్వాస్పత్రిలో ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఈరోజు (మంగళవారం) బైకుపై వచ్చి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పార్కింగ్ చేయకుండా అడ్డదిడ్డంగా ఉన్న వాహనాలను చూసి సెక్యూరిటీ విభాగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లుగా వాహనాలు పార్కింగ్ చేస్తుంటే సిబ్బంది ఏం చేస్తున్నారని మందలించారు. అనంతరం పలు విభాగాల్లో తనిఖీలు చేశారు. అలాగే, ఓపీ రిజిస్ట్రేషన్లను పరిశీలించి.. ఓపీలో చాలామంది రోగులు వేచి ఉండటంపై మంత్రి ఆరా తీశారు.
కౌంటర్ల సంఖ్యను పెంచాలని సూపరింటెండెంట్కు మంత్రి ఆదేశించారు. ఓపీలో రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. రక్తనమూనా పరీక్షల విభాగం, ఎక్సరే విభాగాలను పరిశీలించారు. ఆస్పత్రి వైద్యులతో సమావేశమై వైద్య సేవల గురించి చర్చించారు. పారిశుద్ధ్య, పార్కింగ్ వ్యవస్థను మెరుగుపర్చాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళా బిల్లును డీఎంకే అడ్డుకుంది.. సీఎం చంద్రబాబు ధ్వజం
అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించే విజనరీ లీడర్ చంద్రబాబు: జనార్దన్ రెడ్డి
జగన్వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం
Read Latest AP News And Telangana News And International News And Telugu News